Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది నా రక్తంలో లేదు: రాధా రవి

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (17:54 IST)
కొన్ని రోజుల క్రితం నయనతార గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించిన రాధారవి.. వివాదం కాస్తా ముదరడంతో ఆ తర్వాత క్షమాపణలు చెప్పేసిన సంగతి తెలిసిందే. దీంతో అంతా సద్దు మణిగిందే. అయితే ఇటీవల తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ విషయమై మరోసారి స్పందించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
 
వివరాలలోకి వెళ్తే... ఇటీవల ఓ లఘుచిత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన గతంలో నయనతార విషయంలో జరిగిన ఉదంతాన్ని గుర్తుచేసుకుంటూ... తాను తప్పుగా మాట్లాడి ఉంటే తన మాటలను వెనక్కి తీసుకుంటానని చెప్పానే కానీ ఎవ్వరికీ క్షమాపణలు మాత్రం చెప్పలేదని అన్నారు. 
 
అలా చెప్పడం తన రక్తంలోనే లేదని పేర్కొన్న ఆయన... అక్కడితో ఆగకుండా ‘‘నేను నయనతారకు ఎందుకు సారీ చెప్పాలి? నేనేమైనా పెద్ద తప్పు చేసానా? ఈ రోజు నేను మాట్లాడుతుంటే జనం ఎలా అయితే చప్పట్లు కొడ్తున్నారో.. ఆ రోజు కూడా జనం అలాగే చప్పట్లు కొట్టారు. నిజం మాట్లాడిన ప్రతీ సారి జనం మద్దతు నాకే ఉంటుంది. నేను ఇక సినిమాల్లో నటించనని చాలా మంది బెదిరిస్తున్నారు... సినిమాలు కాకపోతే నాటకాలు చేసుకుంటా! ఇలాంటివన్నీ తాత్కాలికమే’’ అని రాధా రవి తెలపడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మరి ఈ ప్రకటన మరెంత దుమారాన్ని రేపుతుందో వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments