Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది నా రక్తంలో లేదు: రాధా రవి

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (17:54 IST)
కొన్ని రోజుల క్రితం నయనతార గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించిన రాధారవి.. వివాదం కాస్తా ముదరడంతో ఆ తర్వాత క్షమాపణలు చెప్పేసిన సంగతి తెలిసిందే. దీంతో అంతా సద్దు మణిగిందే. అయితే ఇటీవల తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ విషయమై మరోసారి స్పందించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
 
వివరాలలోకి వెళ్తే... ఇటీవల ఓ లఘుచిత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన గతంలో నయనతార విషయంలో జరిగిన ఉదంతాన్ని గుర్తుచేసుకుంటూ... తాను తప్పుగా మాట్లాడి ఉంటే తన మాటలను వెనక్కి తీసుకుంటానని చెప్పానే కానీ ఎవ్వరికీ క్షమాపణలు మాత్రం చెప్పలేదని అన్నారు. 
 
అలా చెప్పడం తన రక్తంలోనే లేదని పేర్కొన్న ఆయన... అక్కడితో ఆగకుండా ‘‘నేను నయనతారకు ఎందుకు సారీ చెప్పాలి? నేనేమైనా పెద్ద తప్పు చేసానా? ఈ రోజు నేను మాట్లాడుతుంటే జనం ఎలా అయితే చప్పట్లు కొడ్తున్నారో.. ఆ రోజు కూడా జనం అలాగే చప్పట్లు కొట్టారు. నిజం మాట్లాడిన ప్రతీ సారి జనం మద్దతు నాకే ఉంటుంది. నేను ఇక సినిమాల్లో నటించనని చాలా మంది బెదిరిస్తున్నారు... సినిమాలు కాకపోతే నాటకాలు చేసుకుంటా! ఇలాంటివన్నీ తాత్కాలికమే’’ అని రాధా రవి తెలపడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మరి ఈ ప్రకటన మరెంత దుమారాన్ని రేపుతుందో వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో బిస్ట్రోలో డ్రగ్ పార్టీ జరిగిందా?

తండ్రి ఫిర్యాదు ఎఫెక్ట్.. ఠాణాలో తనయుడు ... నిరసన తెలిపిన హీరో (Video)

Delhi: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? మహిళను ముఖ్యమంత్రి చేయనున్నారా?

అమెరికాకు పాకిన బర్డ్ ఫ్లూ.. డజను కోడిగుడ్ల ధర రూ.800పైనే.. చికెన్ ధరలకు రెక్కలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments