Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివాజీకి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టిన పోలీసులు... ఎందుకంటే?

Webdunia
బుధవారం, 3 జులై 2019 (12:33 IST)
తెలుగు హీరో శివాజీని తెలంగాణ రాష్ట్రంలోని సైబరాబాద్ పోలీసులు బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని గంటల విచారణ తర్వాత ఆయన్ను వదిలివేశారు. తాము పంపించిన నోటీసులకు స్పందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపించివేసినట్టు తెలుస్తోంది. 
 
ఇటీవల అలంద మీడియా(టీవీ9) షేర్ల కొనుగోలు వ్యవహారంలో తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో శివాజీ నిందితుడిగా ఉన్న విషయం తెల్సిందే. ఈ కేసులో టీవీ మాజీ సీఈఓ రవి ప్రకాష్‌తో పాటు శివాజీకి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు స్పందించిన రవి ప్రకాష్ విచారణకు హాజరయ్యారు. 
 
కానీ, శివాజీ మాత్రం విచారణకు డుమ్మాకొట్టారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి అమెరికాకు పారిపోతుండగా, సైబరాబాద్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయన పాస్ పోర్టును సీజ్ చేశారు.
 
ఈ సందర్భంగా ఆయనకు సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు జారీచేశారు. జూలై 11వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అనంతరం వదిలిపెట్టారు. దీంతో తన కారులో శివాజీ ఇంటికి వెళ్లిపోయారు. ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో శివాజీని ఎయిర్ పోర్టులో గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో సైబరాబాద్ పోలీసులు వచ్చి శివాజీని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వల్లభనేని వంశీకి షాక్ - అలా బెయిల్ ఎలా ఇస్తారంటూ సుప్రీం ప్రశ్న?

Delhi: మూడేళ్ల పసికూనపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు

అలస్కా తీరంలో భూకంపం : రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు

అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. ఎందుకో తెలుసా?

హిందూపురం నుంచి ఇద్దరిని సస్పెండ్ చేసిన వైకాపా హైకమాండ్- దీపికకు అది నచ్చలేదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments