Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్‌ మిసెస్‌ యూనివర్సల్‌ పోటీల్లో హైదరాబాద్ అమ్మాయి..

Webdunia
బుధవారం, 22 మే 2019 (14:25 IST)
హైదరాబాద్ యువతి ప్రపంచ అందాల పోటీల్లో దూసుకెళ్తోంది. వరల్డ్‌ మిసెస్‌ యూనివర్సల్‌ పోటీల్లో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన రోహిణినాయుడు ఫైనల్‌కు ఎంపికయ్యారు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో జరగబోయే ఫైనల్స్‌లో ఆమె పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2019 మిస్‌ ఇండియా వరల్డ్‌ వైడ్‌ పోటీల్లో పాల్గొని దాని ద్వారా తాను యూనివర్సల్‌ ఫైనల్‌ పోటీలకు ఎంపికయ్యానని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి దాదాపు 30 వేల మంది ఈ పోటీల కోసం దరఖాస్తు చేసుకోగా, వారిలో 172 మంది మాత్రమే ఫైనల్‌కు ఎంపియ్యారని, అందులో ఇండియా నుంచి తాను మాత్రమే ఎంపికైనట్లు చెప్పారు. 
 
వరల్డ్ మిసెస్ యూనివర్శల్ పోటీలు అక్టోబర్‌ నెలలో గ్రీస్‌లో జరగబోతున్నాయని, ఈ పోటీలకు ఎంపిక కావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీల్లో భాగంగా నాలుగు వారాల పాటు వ్యక్తిత్వ వికాసం, మహిళా సాధికారత, లింగ సమానత్వం తదితర అంశాలలో ఒక్కో వారం ఒక్కో అంశంపై నాలుగు టాస్క్‌‌లు చేసి సోషల్ మీడియాలో అందుబాటులో ఉంచుతామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొక్కజొన్న తోటలో దారుణం : వేరొకరితో మాట్లాడుతుందని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు...

నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైకాపా అదృష్టం : ఆర్ఆర్ఆర్

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఉగ్రవాదులతో లింకులు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల డిస్మిస్

శారీరకంగా వాడుకుని తప్పించుకు తిరుగుతున్నాడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments