Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్‌ మిసెస్‌ యూనివర్సల్‌ పోటీల్లో హైదరాబాద్ అమ్మాయి..

Webdunia
బుధవారం, 22 మే 2019 (14:25 IST)
హైదరాబాద్ యువతి ప్రపంచ అందాల పోటీల్లో దూసుకెళ్తోంది. వరల్డ్‌ మిసెస్‌ యూనివర్సల్‌ పోటీల్లో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన రోహిణినాయుడు ఫైనల్‌కు ఎంపికయ్యారు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో జరగబోయే ఫైనల్స్‌లో ఆమె పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2019 మిస్‌ ఇండియా వరల్డ్‌ వైడ్‌ పోటీల్లో పాల్గొని దాని ద్వారా తాను యూనివర్సల్‌ ఫైనల్‌ పోటీలకు ఎంపికయ్యానని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి దాదాపు 30 వేల మంది ఈ పోటీల కోసం దరఖాస్తు చేసుకోగా, వారిలో 172 మంది మాత్రమే ఫైనల్‌కు ఎంపియ్యారని, అందులో ఇండియా నుంచి తాను మాత్రమే ఎంపికైనట్లు చెప్పారు. 
 
వరల్డ్ మిసెస్ యూనివర్శల్ పోటీలు అక్టోబర్‌ నెలలో గ్రీస్‌లో జరగబోతున్నాయని, ఈ పోటీలకు ఎంపిక కావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీల్లో భాగంగా నాలుగు వారాల పాటు వ్యక్తిత్వ వికాసం, మహిళా సాధికారత, లింగ సమానత్వం తదితర అంశాలలో ఒక్కో వారం ఒక్కో అంశంపై నాలుగు టాస్క్‌‌లు చేసి సోషల్ మీడియాలో అందుబాటులో ఉంచుతామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments