స్మార్ట్ ఫోన్ల వల్లే మహిళలు భర్త, పిల్లల్ని వదిలేస్తున్నారు.. అత్యాచారాలు కూడా?: భాగ్యరాజా

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (12:25 IST)
స్మార్ట్ ఫోన్లు లేకుండా పొద్దుగడవదు చాలామందికి. పురుషులైనా, మహిళలైనా స్మార్ట్ ఫోన్లను తెగ వాడేస్తున్నారు. బయట ప్రపంచంలో ఏం జరుగుతున్నా కొందరు స్మార్ట్ ఫోన్లలో మునిగిపోయి ఏదీ పట్టించుకోరు. 24 గంటలూ స్మార్ట్ ఫోన్లతో కాలం వెచ్చించే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ల వాడకం వల్లే మహిళలు పాడైపోతున్నారని తమిళంలో విభిన్న కథా చిత్రాల నటుడిగా, దర్శకుడిగా తన కంటూ గుర్తింపు సంపాదించుకున్న భాగ్యరాజా వ్యాఖ్యానించారు. 
 
తాజాగా భాగ్యరాజా చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశమైనాయి. ఓ సినిమా కార్యక్రమంలో భాగ్యరాజా మాట్లాడుతూ..  ముఖ్యంగా సెల్ ఫోన్స్ కారణంగా ఆడవాళ్లు చెడిపోతున్నారు. వివాహేతర సంబంధం కోసం భర్త, పిల్లల్ని ఒదిలేస్తున్నారన్నారని కామెంట్స్ చేయడం ప్రస్తుతం వివాదాస్పదమైనాయి. 
 
అంతేకాదు మహిళల అజాగ్రత్త వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. తాజాగా పొలాచ్చిలో జరిగిన అత్యాచార ఘటనలో మగవాళ్లది అసలు తప్పే లేదన్నారు. అక్కడ అమ్మాయి అవకాశం ఇచ్చింది కాబట్టి అత్యాచారం జరిగిందన్నారు. మరోవైపు ఇపుడున్న ఆడవాళ్లు చాలా మంది కట్టుబాట్టను ఒదిలేస్తున్నారని వ్యాఖ్యానించారు. 
 
అలాంటి వాళ్ల వల్లే ఇన్ని అనర్థాలు వచ్చిపడ్డాయన్నారు. ఇంకోవైపు  ఆడవాళ్లు కట్టుబాట్ల గురించి మాట్లాడిన భాగ్యరాజా పురుషులు ఎన్ని సంబంధాలు పెట్టుకున్న ఏమి కాదంటూ వ్యాఖ్యానించడం కొసమెరుపు. భాగ్యరాజా వ్యాఖ్యలు తమిళనాడు వ్యాప్తంగా మహిళ సంఘాలు భాగ్యరాజా తీరుపై మండిపడుతున్నాయి. వెంటనే ఆయన మహిల సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజస్థాన్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న టెంపో ట్రావెలర్.. 18 మంది మృతి

Bahubali: ఇస్రో అదుర్స్: జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి CMS-03 ఇస్రో హెవీలిఫ్ట్ రాకెట్

ములుగు జిల్లా.. ఉద్యోగి భుజంపై ఎక్కి కూర్చుని హాయిగా నిద్రపోయిన వానరం (video)

గర్భవతిని చేసి బిడ్డ పుట్టాక రెండో పెళ్లి -ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా

Minor girl: తమ్ముడు కిందపడిపోయాడని నమ్మించి.. బాలికపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments