Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆర్థిక - అనారోగ్య కష్టాల్లో మెగా డైరెక్టర్.. చిరంజీవి ఆదుకునేనా?

ఆర్థిక - అనారోగ్య కష్టాల్లో మెగా డైరెక్టర్.. చిరంజీవి ఆదుకునేనా?
, శుక్రవారం, 15 నవంబరు 2019 (15:04 IST)
మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం 'పునాది రాళ్లు'. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన వ్యక్తి గూడపాటి రాజ్‌కుమార్. ప్రస్తుతం ఈయన వయస్సు 75 యేళ్లు. అయితే, ప్రస్తుతం ఈయన ఈయన తీవ్రమైన ఆర్థిక కష్టాలతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 
 
గత రెండు నెలల క్రితం ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. రక్తపు విరేచనాలు, గుండెకు వేసిన రెండు స్టంట్‌లతో ఇబ్బంది పడతున్నారు. ఇపుడు ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వైద్య ఖర్చులకు కూడా స్తొమత లేక అల్లాడిపోతున్నారు. 
 
ఆయన కుమారుడు కొన్నేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. అనంతరం కొన్ని రోజులకే ఆయన భార్య కూడా మరణించారు. అనారోగ్యంతో మంచానికే పరిమితమై వైద్యం కోసం సాయం అందిచేవారి కోసం ఎదురు చూస్తున్నారు. 
 
కాగా, గూడపాటి రాజ్‌కుమార్ దర్శకుడిగానే కాదు... సినిమా నిర్మాతగా, కథ, పాటల రచయితగానూ పని చేశారు. అయినప్పటికీ ఆయనకు ఇప్పటికీ హైదరాబాద్‌లో సొంతిల్లు కూడా లేదు. అద్దె ఇంట్లోనే ఆయన ఉంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనుష్క ఆ మాట చెప్పగానే గుండె పగిలినట్లయ్యింది, మెహరీన్