హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

దేవీ
గురువారం, 31 జులై 2025 (17:42 IST)
Honeymoon in Shillong Poster
సమాజంలో ఏ సంఘటన జరిగినా దానిని వెంటనే సినిమా మలిచే ప్రక్రియ కొనసాగడం మామూలే. మనకు తెలిసి రామ్ గోపాల్ వర్మ ఇటువంటి కథలతో సినిమాగా మార్చడం మామూలే. కానీ ఆమధ్య జూన్ నెలలో హనీమూన్ కోసం వెళ్ళిన షిల్లాంగ్ వెళ్ళిన సోనమ్ భర్తను ప్రియుడితో చంపించడం పెద్ద సెన్సేషనల్ గా మారింది. దీనిని సినిమాగా తీయడానికి బాలీవుడ్ పలువురు ప్రయత్నించగా దర్శకుడు ఎస్.పి. నింబావత్ ముందుకు వచ్చారు. దీనికి హనీమూన్ ఇన్ షిల్లాంగ్ అనే పేరు పెట్టారు.
 
ఈ సంఘటనను సినిమాగా తీస్తే ప్రజలకు ఏమి జరిగిందో తెలుస్తుందని మ్రుతుడు రాజా రఘువంశీ కుటుంబం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ 80 శాతం పూర్తయింది. త్వరలో వెండితెరపై ఆవిష్కరణ ప్రారంభంకానుంది. భవిష్యత్ లో ఇటువంటి సంఘటనలు జరగకూడదని చిత్రాన్ని రూపొందిస్తున్నానని దర్శకుడు తెలిపారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ, "ఇది కేవలం సినిమా కాదు, సున్నితమైన నిజమైన సంఘటన ఆధారంగా రూపొందించిన కథ. మేము దీనిని అత్యంత బాధ్యతాయుతంగా  చేస్తాము. అన్నారు. 'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' యొక్క మొదటి పోస్టర్ ఇటీవల సోషల్ మీడియాలో విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఆ ప్రభుత్వం వుంది.. మనం బుల్లెట్ రైలులా దూసుకెళ్తున్నాం: నారా లోకేష్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. సునీత కోసం ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారా?

Pepper Spray: తరగతి గదిలో పెప్పర్ స్ప్రే.. ఆస్పత్రిలో తొమ్మిది మంది విద్యార్థులు, టీచర్లు

విశాఖలో గూగుల్ ఆర్టిఫిషియల్ హబ్ : ప్రశంసల వర్షం కురిపించిన జేపీ

పిల్లలకు విషం ఇచ్చాడు.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments