Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉన్మాదిగా మారిన కిట్టు ఆరాధ్యను ఏం చేశాడు? ఓటీటీలో బోల్డ్ థ్రిల్లర్

Advertiesment
aradhya devi

ఠాగూర్

, బుధవారం, 25 జూన్ 2025 (13:34 IST)
ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం "శారీ". బోల్డ్ థ్రిల్లర్ మూవీ. హీరోయిన్‌గా ఆరాధ్య దేవి నటించారు. ఈ సినిమాతో ఆమె వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. వర్మ శిష్యుడు గిరికృష్ణ దర్శకత్వం వహించగా, రాంగోపాల్ వర్మ సొంతంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ నాలుగో తేదీన విడుదల చేశారు. యూత్ నుంచి భారీ స్థాయిలో స్పందనను ఆశించారు. కానీ, కథ అడ్డం తిరిగింది. పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అలాంటి ఈ సినిమా ఈ నెల 27వ తేదీ నుంచి "లయ్స్ గేట్ ప్లే"‌ అనే ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. 
 
కథ వి షయానికి వస్తే కిట్టూ అనే కుర్రోడు ఫ్రెండ్స్‌తో కలిసి విహారయాత్రకు వెళారు. అక్కడ అతనికి ఒక అందమైన యువతి కనిపిస్తుంది. ఆమె చీరకట్టు అతనికి విపరీతంగా నచ్చేస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఐ లవ్ యూ అని చెబుతాడు. ఆమె మాత్రం సున్నితంగా తిరస్కరిస్తుంది. దాంతో ఉన్మాదిగా మారిపోయిన కిట్టూ ఏం చేస్తాడు అన్నదే ఈ చిత్రం కథ. ఈ చిత్రం ఇపుడు ఓటీటీలో రిలీజ్ చేస్తుండగా, ప్రేక్షకుల నుంచి స్పందన ఏ స్థాయిలో ఉంటుందో వేచిచూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలీవుడ్ నటి సనా ఖాన్‌కు మాతృవియోగం