Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియుడుతో అక్రమ సంబంధం ఉంది : అంగీకరించిన సోనమ్

Advertiesment
Sonam

ఠాగూర్

, బుధవారం, 25 జూన్ 2025 (09:00 IST)
మేఘాలయ హనీమూన్ హత్య కేసు దర్యాప్తు జరిగేకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో వివాహేతర సంబంధం ఉన్న మాట నిజమేనని మృతుని భార్య సోనమ్ రఘువంశీ అంగీకరించారు. కొత్తగా పెళ్ళి చేసుకుని మేఘాలయ రాష్ట్రానికి హనీమూన్ కోసం వెళ్లిన దంపతుల్లో భారత్ రాజ్ రఘువంశీని భార్య సోనమ్, ఆమె ప్రియుడు, మరికొందరుకి కిరాయి ముఠా సభ్యులు కలిసి హత్య చేసిన విషయం తెల్సిందే. ఈ దారుణ హత్యపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతోంది. 
 
ఈ హత్య కేసు పురోగతిని ఈస్ట్ ఖాసీ హిల్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వివేక్ నయీమ్ మీడియాకు వెల్లడించారు. తమ విచారణలో సోనమ్, రాజ్‌ ఇద్దరూ తాము చేసిన నేరాన్ని అంగీకరించారని తెలిపారు. పైగా, వారిద్దరికీ వివాహేతర సంబంధం ఉన్నట్టు వెల్లడించారని తెలిపారు. వారు ఇప్పటికే నేరాన్ని అంగీకరించారు. మేము నేరం జరిగిన తీరును పునఃసమీక్షించాం. వారు మాకు అంతా చూపించారు. మాకు తగిన ఆధారాలు లభించాయి. ఈ దశలో నార్కో అనాలసిస్ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఎటువంటి ఆధారాలు లేనపుడు నార్కో టెస్ట్ చేస్తారు. పైగా నార్కో అనాలసిస్‌ను సుప్రీంకోర్టు ఖండించింది అని ఆయన గుర్తుచేశారు.
 
అయితే, హత్య వెనుక కారణాలు స్పష్టంగా చెప్పనప్పటికీ రాజాను మాత్రం తమదారి నుంచి తొలగించుకోవాలన్నదే వారి ప్రధాన లక్ష్యం. వారు రాజాను ఈ మొత్తం వ్యవహారం నుంచి బయటకు పంపాలనుకున్నారు. ఎందుకంటే వారి మధ్య వివాహేతర సంబంధం ఉంది. అందుకే ఈ వ్యక్తిని వదలించుకుంటే మంచిదని భావించి, ఈ దారుణానికి పాల్పడ్డారు అని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచంలో భయాందోళనలను సృష్టించిన ఇరాన్ సైనిక సామర్థ్యం