Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవిపై తేనెటీగల దాడి... కాపాడిన రక్షణ సిబ్బంది

Webdunia
ఆదివారం, 31 మే 2020 (14:07 IST)
మెగాస్టార్ చిరంజీవి ఆదివారం తేనెటీగల దాడి నుంచి తప్పించుకున్నారు. ఆయనపైనా, ఆయన కుటుంబ సభ్యులపై తేనెటీగలు దాడి చేశాయి. వీటి నుంచి ఆయన సహయ సిబ్బంది రక్షించారు. అసలు చిరంజీవిపై తేనెటీగలు ఎందుకు దాడిచేయాన్నదే కదా మీ  సందేహం. ఇవిగో వివరాలు..
 
మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన తాతయ్య, దోమకొండ సంస్థాన వారసుడు, తిరుమల తిరుపతి దేవస్థానం తొలి ఈవో కామినేని ఉమాపతిరావు (రిటైర్టు ఐఏఎస్ అధికారి) బుధవారం మృతిచెందారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం ఉదయం నిర్వహించారు. గడికోట లక్ష్మీబాగ్‌లో ఇవి జరిగాయి. 
 
ఈ కార్యక్రమం కోసం చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన ఇతర బంధువులు హాజరయ్యారు. గడికోట నివాసం నుంచి ఉమాపతిరావు భౌతికకాయాన్ని వెలుపలికి తీసుకువస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దాంతో అందరూ చెల్లాచెదురయ్యారు. 
 
అయితే, భద్రతా సిబ్బంది అప్రమత్తమై చిరంజీవి, రామ్ చరణ్‌లను ఇంట్లోకి తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది. కాసేపటికి తేనెటీగలు శాంతించడంతో అంత్యక్రియలు యథావిధిగా పూర్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments