ఇంటర్వ్యూ లైవ్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్న కృతిశెట్టి.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 30 మే 2022 (17:20 IST)
ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి టాలీవుడ్ టాప్ హీరోయిన్ల ఒకరిగా నిలిచింది. ఉప్పెన సక్సెస్‌తో కృతికి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. నాగచైతన్యకు జంటగా బంగార్రాజు సినిమాలో కూడా ఆమె నటించింది. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్‌ సినిమాలో కూడా నటించి సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా మారింది.

 
 
తాజాగా కృతిశెట్టి సుధీర్ బాబుతో "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి", రామ్‌కు జోడీగా "ది వారియర్‌", నితిన్ సరసన "మాచర్ల నియోజకవర్గం" చిత్రాలు చేస్తోంది. అలాగే కోలివుడ్‌లో సూర్యతో కలిసి 41వ చిత్రంలో హీరోయిన్‌గా కూడా చేస్తోంది. అయితే ఈక్రమంలో తమిళనాట కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. 

 
ప్రాంక్‌స్టర్లు ఆశిక్, సారథిరన్ కృతిని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో కృతి కన్నీళ్లు పెట్టుకుంది. యాంకర్ల ప్రవర్తన చూసి ఆమె ఎమోషనల్ అయిపోయింది. 

 
అంతేకాదు.. హీరోయిన్ ఎదుటే కొట్లాకు కూడా దిగారు. దాంతో ఏం జరుగుతుందో తెలియక కృతి భయపడిపోయింది. ఆ తర్వాత వారు ప్రాంక్ అనడంతో ఊపిరి పీల్చుకున్న కృతి.. మొదట నవ్వినా ఆపై దుఖం ఆపుకోలేక లైవ్‌లోనే ఏడ్చేసింది. దాంతో ఆమెకు సర్దిచెప్పారు సదరు యాంకర్లు.. ఆ తర్వాత ఎందుకు ఏడ్చారు, ఏమైంది అని ప్రశ్నించారు.

 
అందుకు కృతి ఎవరైనా కఠినంగా మాట్లాడితే తనకు అస్సలు నచ్చదని, భయం వేస్తుందని చెప్పుకొచ్చింది. మొత్తానికి కృతి ఏడుస్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమానాన్ని ఢీకొన్న పక్షి... 158 మందికి తప్పిన ప్రాణముప్పు

నకిలీ మద్యం కేసు : ములకల చెరువు ఎక్సైజ్ సీఐ హిమబిందుపై వేటు

స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు: కాకినాడలో ఉన్నతి ఫౌండేషన్ కొత్త వృత్తి శిక్షణా కేంద్రం ప్రారంభం

చెల్లిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడనీ యువకుడిని హత్య చేసిన అన్న

Telangana: తెలంగాణలో రీ-ఎంట్రీ ఇవ్వనున్న చంద్రబాబు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments