Webdunia - Bharat's app for daily news and videos

Install App

#JaiLavaKusa50Days : "జై" పాత్రలో మెప్పించిన ఎన్టీఆర్..

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో వచ్చిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఇందులో నివేదా థామ

Webdunia
గురువారం, 9 నవంబరు 2017 (10:02 IST)
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో వచ్చిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఇందులో నివేదా థామస్, రాశీఖన్నాలు హీరోయిన్లుగా నటించారు. 
 
గత సెప్టెంబర్ 21వ తేదీన విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంతో కెరీర్‌లో ఒక మంచి సక్సెస్‌ను అందుకోవడమేగాక నటుడిగా కూడా తారక్ ఒక మెట్టు పైకెక్కాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న 'జై' పాత్రలో నటించి అందరినీ మెప్పించాడు. ఈ పాత్ర ఎన్టీఆర్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుందనడంలో అతిశయోక్తిలేదు.
 
ఈ చిత్రం గురువారంతో 50 రోజులు పూర్తిచేసుకోనుంది. సుమారు రూ.72 కోట్ల షేర్‌ను వసూలు చేసిన ఈ చిత్రం తారక్ కెరీర్‌లోనే రెండో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇకపోతే తారక్ ఈ మధ్యే త్రివిక్రమ్‌తో ఒక సినిమాను లాంచ్ చేశారు. త్రివిక్రమ్ చేస్తున్న పవన్ చిత్రం పూర్తవగానే ఈ చిత్రం మొదలుకానుంది.

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments