Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ మహిళా కార్మికులకు కమెడియన్ అలీ దంపతుల సాయం

Webdunia
సోమవారం, 24 మే 2021 (16:30 IST)
కరోనా సెకండ్ వేవ్‌తో తెలుగు సినీ పరిశ్రమ టాలీవుడ్ స్తంభించిపోయింది. దాంతో 24 క్రాఫ్ట్స్‌కు చెందిన కార్మికులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ కమెడియన్ అలీ, జుబేదా దంపతులు టాలీవుడ్ ఉమెన్ ప్రొడక్షన్ యూనియన్ మహిళా కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. 10 కిలోల బియ్యం, గోధుమ పిండి, నూనె, చక్కెర, మరో 8 రకాల సరుకులను ఉచితంగా పంపిణీ చేశారు. మొత్తం రూ.2 లక్షల వ్యయంతో 130 మందికి సాయం చేసినట్టు అలీ తెలిపారు.
 
ఈ మహిళా కార్మికులు తమకంటే ముందే షూటింగ్ స్పాట్‌కు వెళ్లిపోయి విధులు నిర్వర్తిస్తుంటారని, తాము తిన్న ప్లేట్లను, కాఫీ కప్పులను కూడా శుభ్రం చేస్తుంటారని వివరించారు. కరోనా కారణంగా పని లేక వారు ఇబ్బంది పడుతుంటే తన వంతుగా స్పందించానని అలీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అలీ సోదరుడు ఖయ్యూం తదితరులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేశాలను అందంగా కట్ చేసుకునే పురుషులకు శిక్ష!!

వారం కిందటే ఇన్‌స్టాగ్రాంలో పరిచయమయ్యాడు, భర్తను వదిలేసి అతణ్ణి పెళ్లాడింది

చంద్రబాబుకు వైకాపా అంటే దడ.. అబద్ధాలతో మోసం.. రెడ్ బుక్ రాజ్యాంగం: జగన్

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments