Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల వైకుంఠపురంలో.. మలయాళ ఫ్యాన్స్ హంగామా.. ఆ రెండు పాటలూ..?

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (14:08 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ హీరోహీరోయిన్లుగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ''అల వైకుంఠపురములో".

ఈ నేపథ్యంలో బన్నీ సినిమాలకు మలయాళంలోనూ మంచి డిమాండ్ ఉంటుంది.. అలా వైకుంఠపురములో చిత్రాన్ని మలయాళంలో విడుదల చేస్తున్నారు. మలయాళ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు నిర్మాతలు. "అంగ వైకుంఠపురత్తు" అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 
 
తాజా పోస్టర్లో బన్నీ లుక్ బాగుంది. ఇక సామజనవరగమన మలయాళ సాంగ్‌ను నవంబర్ 10న విడుదల చేయనున్నారు. అలాగే ఇలా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారో లేదో కేరళలో బన్నీ ఫ్యాన్స్ హంగామా స్టార్ట్ చేసేశారు. ఫస్ట్ లుక్ ఫ్లెక్సీలతో సందడి చేస్తున్నారు.

త్వరలో మలయాళ వెర్షన్ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ కలిసి నిర్మిస్తున్న ''అల వైకుంఠపురములో'' సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న భారీగా రిలీజ్ కానుంది.
 
ఇక తెలుగులో ఇటీవల విడుదల చేసిన ‘సామజవరగమన’, ‘రాములో రాములా’ పాటలు యూట్యూబ్‌లో రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు పాటలు కలిపి 150 మిలియన్లకు పైగా వ్యూస్ దాటడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగయ్య మృతిపై జగన్ ట్వీట్.. సీరియస్ అయిన వంగలపూడి అనిత

జగన్ చేసిన తప్పును ఫేక్ వీడియోతో మభ్యపెట్టడం దారుణం : వైఎస్ షర్మిల

రాజకీయ ముసుగులో ఉన్న కరుడుగట్టిన నేరస్థుడు జగన్ : హోం మంత్రి అనిత

మేఘాలయ హానీమూన్ హత్య కేసు : కీలక ఆధారాలు దాచేసిన ఫ్లాట్ యజమాని

మా బూట్లు నాకడానికి కూడా నవ్వు పనికిరావు... ఇంటికెళ్లి చెప్పులు కుట్టుకోపో...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments