Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీన్ ఇండియా చాలెంజ్: మొక్కలు నాటిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (19:04 IST)
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా హీరో సుశాంత్ ఇచ్చిన చాలెంజ్‌ను స్వీకరించి నేడు మాదాపూర్‌లో మొక్కలు నాటారు ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవ మనుగడకు మొక్కలు చాలా ముఖ్యమని, రోజురోజుకు పట్టణాలలో పచ్చదనం తగ్గిపోతుందని, కాబట్టి అందరూ బాధ్యతాయుతంగా మొక్కలు నాటాలని తెలిపారు. మొక్కలు నాటడం వలన మనం నిత్యం పీల్చుకునే ప్రాణ వాయువు ఆక్సిజన్ ఎక్కువ స్థాయిలో లభిస్తుందని తెలిపారు.
 
మొక్కలను అధిక స్థాయిలో నాటి వాటిని పెంచి పోషించడం వల్ల ఆక్సిజన్ ఎక్కువ స్థాయిలో లభ్యమవుతుంది. ఇంత మంచి కార్యక్రమానికి పూనుకున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోశ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చాలెంజ్ అదేవిధంగా కొనసాగాలని తన అభిమానులను, స్నేహితులను మొక్కలు నాటి వాటిని సోషల్ మీడియాలో పెట్టాలని దాన్ని నేను షేర్ చేస్తానని తెలిపారు.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments