Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంసాహారాన్ని పోలిన శాకాహారం: జెనీలియా దంపతుల కొత్త బిజినెస్

Webdunia
బుధవారం, 22 జులై 2020 (13:55 IST)
బాలీవుడ్ ప్రేమ దంపతులు రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా కొత్త బిజినెస్‌ ప్రారంభించింది. దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా రాణించిన జెనీలియా ఆపై బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్‌ను వివాహం చేసుకొని ముంబైలో సెటిల్ అయ్యింది. అయితే, ఈ సెలెబ్రిటీ కపుల్స్ గత నాలుగేళ్లుగా మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు. భవిష్యత్తులో మాంసం ముట్టుకోకూడదని తీర్మానించారు. 
 
ఈ జంట అప్పటి నుంచి శాకాహారమే తీసుకుంటున్నారు. అయితే, రుచిలోనూ, వాసనలోనూ, పోషక పదార్ధాల్లోనూ మాంసాన్ని తలపించేలా కొన్ని మొక్కలు ఉన్నాయి. మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా వాటిని తీసుకుంటూ ఉంటారు. గత కొన్నేళ్లుగా ఈ సెలెబ్రిటీ జంట వాటిని ఆహారంలో వినియోగిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ మొక్కలతో తయారయ్యే ఆహారాన్ని భారత్‌లో ఉత్పత్తి చేయాలని జెనీలీయా దంపతులు భావించారు. ఇందులో భాగంగా మాంసాహారాన్ని పోలిన రుచికరమైన శాకాహారాన్ని ప్రజలకు అందజేయాలని భావిస్తున్నారు. 
 
ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఆర్చర్ డేనియల్స్ మిడ్ ల్యాండ్ గుడ్ పుడ్స్‌ ఇనిస్టిట్యూట్‌ కలిసి జెనీలియా దంపతులు ఇమేజిన్ మీట్ పేరుతో భారత్‌లో బిజినెస్‌ను లాంచ్ చేయబోతున్నారు. ఈ ఇమేజిన్ మీట్ ద్వారా బిర్యానీ, కబాబ్ వంటి ఆహార పదార్థాలు తయారు చేసుకోవచ్చని ఈ సెలెబ్రిటీ కపుల్స్ చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొక్కజొన్న పొలంలో 40 ఏళ్ల ఆశా కార్యకర్త మృతి.. లైంగిక దాడి జరిగిందా?

ప్రధాని మోదీ వల్లే ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు.. చంద్రబాబు కితాబు

నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 28 మంది మృతి

భారతీయుల ఆగ్రహం: ఛీ.. ఛీ.. మీ దేశం ముఖం చూడం, టర్కీకి 11,000 కోట్లు నష్టం

Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా-యాక్టివ్‌గా 257 కేసులు-JN.1 Strain

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments