Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంసాహారాన్ని పోలిన శాకాహారం: జెనీలియా దంపతుల కొత్త బిజినెస్

Webdunia
బుధవారం, 22 జులై 2020 (13:55 IST)
బాలీవుడ్ ప్రేమ దంపతులు రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా కొత్త బిజినెస్‌ ప్రారంభించింది. దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా రాణించిన జెనీలియా ఆపై బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్‌ను వివాహం చేసుకొని ముంబైలో సెటిల్ అయ్యింది. అయితే, ఈ సెలెబ్రిటీ కపుల్స్ గత నాలుగేళ్లుగా మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు. భవిష్యత్తులో మాంసం ముట్టుకోకూడదని తీర్మానించారు. 
 
ఈ జంట అప్పటి నుంచి శాకాహారమే తీసుకుంటున్నారు. అయితే, రుచిలోనూ, వాసనలోనూ, పోషక పదార్ధాల్లోనూ మాంసాన్ని తలపించేలా కొన్ని మొక్కలు ఉన్నాయి. మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా వాటిని తీసుకుంటూ ఉంటారు. గత కొన్నేళ్లుగా ఈ సెలెబ్రిటీ జంట వాటిని ఆహారంలో వినియోగిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ మొక్కలతో తయారయ్యే ఆహారాన్ని భారత్‌లో ఉత్పత్తి చేయాలని జెనీలీయా దంపతులు భావించారు. ఇందులో భాగంగా మాంసాహారాన్ని పోలిన రుచికరమైన శాకాహారాన్ని ప్రజలకు అందజేయాలని భావిస్తున్నారు. 
 
ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఆర్చర్ డేనియల్స్ మిడ్ ల్యాండ్ గుడ్ పుడ్స్‌ ఇనిస్టిట్యూట్‌ కలిసి జెనీలియా దంపతులు ఇమేజిన్ మీట్ పేరుతో భారత్‌లో బిజినెస్‌ను లాంచ్ చేయబోతున్నారు. ఈ ఇమేజిన్ మీట్ ద్వారా బిర్యానీ, కబాబ్ వంటి ఆహార పదార్థాలు తయారు చేసుకోవచ్చని ఈ సెలెబ్రిటీ కపుల్స్ చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments