Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగమ్మా మంగమ్మా నెట్టింట్లో చిందేస్తోంది...

తెలుగు సినిమాల్లో పాటల ప్రాధాన్యత ఏమో గానీ సోషల్ మీడియాల ద్వారా మరీ ఎక్కువ హిట్లు వస్తున్నాయి. తెలుగు సినిమాలలో పాటలకు ప్రాధాన్యం చాలా ఎక్కువనే చెప్పాలి. ఒకప్పుడు శంకరాభరణం, సప్తపది వంటి సంగీత సాహిత్య

Webdunia
మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (18:53 IST)
తెలుగు సినిమాల్లో పాటల ప్రాధాన్యత ఏమో గానీ సోషల్ మీడియాల ద్వారా మరీ ఎక్కువ హిట్లు వస్తున్నాయి. తెలుగు సినిమాలలో పాటలకు ప్రాధాన్యం చాలా ఎక్కువనే చెప్పాలి. ఒకప్పుడు శంకరాభరణం, సప్తపది వంటి సంగీత సాహిత్య ప్రాధాన్యంగా వచ్చిన చిత్రాలు సైతం సిల్వర్ జూబ్లీలు జరుపుకునేంతలా చిత్రాలను రూపొందించారు. అయితే కాలగమనంలో ప్రేక్షకులు పాశ్చాత్య సంగీతానికి, కొత్త స్టెప్పులకు అలవాటు పడిపోయారు. అంతేకాకుండా పాటలలో సంగీతానికి ప్రాధాన్యం పెరిగింది కానీ అది సాహిత్యాన్ని మింగేసే పరిస్థితికి వచ్చింది. 
 
మరికొన్ని చిత్రాలు పాటలు లేకుండానే రిలీజైయ్యాయి. అయితే ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల అభిరుచులు మారాయో ఏమో గానీ, గత 2 సంవత్సరాలలో వచ్చిన తెలుగు సినిమా పాటల్లో ఎక్కువ శాతం యూట్యూబ్‌లో హిట్‌లుగా నిలవడానికి కారణం మాత్రం సంగీతంతో పాటు ఇంపైన సాహిత్యమే కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. 
 
ఉదాహరణకు గతేడాది వచ్చిన ఫిదా చిత్రంలోని వచ్చిండే.. పాట ఇప్పటికే 15 కోట్ల హిట్స్‌తో తెలుగు యూట్యూబ్ రికార్డ్‌ల్లో మొదటి స్థానంలో నిలిచింది. బాహుబలి చిత్రంలోని సాహోరే బాహుబలి పాట 125 కోట్ల వ్యూస్‌ను కలిగి ఉంది. ఈ ఏడాది వచ్చిన రంగస్థలం చిత్రంలోని రంగమ్మ మంగమ్మ సాంగ్ 10 కోట్లు హిట్స్‌తో నిలవగా, ఛలో సినిమాలోని చూసి చూడంగానే పాట యువతకు మరింత బాగా నచ్చేసింది. ఈ పాట 8 కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకోగా, తాజాగా విజయ్‌ దేవరకొండ నటించిన గీత గోవిందం చిత్రంలో ఇంకేం ఇంకేం కావాలే పాట అయితే సినిమాను మరో స్థాయిలో నిలబెట్టిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 
 
ఇక్కడ ఉన్న పాటలు సినిమాలో సందర్భానుసారం వచ్చినప్పటికీ అందులోని సాహిత్యం ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా రాయడంలో గేయ రచయితలు విజయం సాధించారు. అందులోనూ సోషల్ మీడియా పుణ్యమా అని అలా వచ్చిన పాటలను యూత్ మరింత ట్రోల్ చేస్తూ వాటికి మరింత ప్రచారాన్ని కల్పిస్తూ ఉండటమే కాకుండా సంగీతంతో పాటుగా సాహిత్యాన్ని కూడా ఆస్వాదిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments