Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలోనే మామిడిచెట్ల మధ్య మెయిన్ మ్యాటర్ జరిగేది.. సుడిగాలి సుధీర్.. రష్మీ..?

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (22:18 IST)
బుల్లితెరపై సుధీర్ రష్మి జంటకు సూపర్ క్రేజ్ వుంది. జబర్దస్త్ నవ్వులు పండాలంటే వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ చేయాల్సిందే అన్నట్టుగా ప్రతివారం ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో వీరిద్దర్నీ హైలైట్ చేస్తుంటారు. వీరిద్దరి మథ్య సంథింగ్ సంథింగ్ ఏదో వుందని వార్తలు వస్తున్నాయి. దీన్ని క్యాష్ చేసుకుంటున్న జబర్దస్త్ టీమ్ తాజాగా మరోసారి సుధీర్, రష్మీల కెమిస్ట్రీని వర్కౌట్ చేస్తూ ప్రోమో వదిలారు. 
 
తాజా ప్రోమోలో మొదటిగా రోహిణి, రాకేష్‌లు వడదెబ్బ స్కిట్‌తో అదరగొట్టేశారు. రోహిణి అయితే టపా.. టపా అని ఎక్కడపడితే అక్కడ పడుతూ నవ్వులు కురిపించింది. ఆ తరువాత రాకేష్ మాస్టర్, నరేష్‌లు కొప్పులో మల్లెపూలు పెట్టుకుని తేడాగా కనిపించారు.
 
ఆ తరువాత సుధీర్ ఎంట్రీతో స్కిట్స్ ఊపందుకున్నాయి. గున్నా గున్నా మామిడీ అంటూ మామిడిపళ్లు వ్యాపారిగా తోపుడుబండిపై మామిడిపళ్లు పట్టుకుని సుధీర్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. రాం ప్రసాద్ కూడా మామిడిపళ్లు అమ్ముతూ సుధీర్‌తో పంచ్‌లు పంచుకున్నాడు.
 
అయితే సుధీర్ మామిడిపళ్లు బండి తోసుకుని హే.. మామిడిపండ్లే అని అంటుంటే.. హే పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యావ్ అంటూ పంచ్‌లు వేసింది రష్మి. ఇక సుధీర్ దగ్గరకు వచ్చిన మరో కమెడియన్.. ‘అవును మామిడిపళ్లు ఎండాకాలంలోనే కాస్తాయి.. మిగతా కాలాల్లో ఎందుకు కాయవు అని సుధీర్‌ని అడగ్గా.. తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చాడు సుధీర్.
 
చలికాలంలో ఒక మామిడిచెట్టు ఇంకో మామిడిచెట్టుపై మనసు పడుతుంది.. రెండూ బాగా ప్రేమించుకోవడంతో వేసవి కాలంలో పళ్లు వస్తాయి అని చెప్తాడు. మరి వర్షాకాలంలో అని అడగ్గా.. ‘వర్షాకాలంలోనే మామిడిచెట్ల మధ్య మెయిన్ మ్యాటర్ జరిగేది’ అంటూ మార్క్ పంచ్ వేశాడు సుధీర్. దీంతో రోజా పడిపడి నవ్వగా.. రష్మి చేతులెత్తి దండం పెట్టేసింది.
 
ఆ తరువాత నువ్ సుడిగాలి సుధీర్‌వి కదా.. నీతో పాటు రష్మి ఉండాలి కదా.. ఏమైంది అని అడగ్గా.. రష్మి రైల్వే స్టేషన్‌లో పూలు అమ్ముకుంటుంది అంటూ పంచ్ వేశాడు సుధీర్. దీంతో రష్మి నోరెళ్లబెట్టింది. ఈ ప్రోమో వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 

సంబంధిత వార్తలు

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments