Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎవ‌రు' మ‌రో క్ష‌ణం అవుతుందా..? అడివి శేష్‌కి విజ‌యాన్ని అందిస్తుందా..?

Webdunia
మంగళవారం, 6 ఆగస్టు 2019 (18:35 IST)
అడివి శేష్, న‌వీన్ చంద్ర‌, రెజీనా ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందిన థ్రిల్ల‌ర్ ఎవ‌రు. ఈ చిత్రానికి వెంక‌ట్ రామ్ జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పీవీపీ సినిమాస్ బ్యానర్ పైన రూపొందిన ఈ మూవీని ఈ నెల 15న రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఎవ‌రు థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసారు. 
 
ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే... రెజీనాను రేప్ చేయబోయిన నవీన్ చంద్రను ఆమె కాల్చి చంపడంతో సినిమా ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. అయితే.. నిజంగానే అత్యాచారయత్నం జరిగిందా? లేక దీని వెనుక మరో కుట్ర ఉందా? అనే విషయాన్ని తేల్చేందుకు ఈ కేసును పోలీస్ అధికారి విక్రమ్ వసుదేవ్(అడవి శేష్)కు అప్పగిస్తారు. 
 
ఈ కేసును విక్రమ్ ఎలా సాల్వ్ చేశాడన్న సస్పెన్స్‌తో సినిమా కొనసాగుతుంది అనేది ట్రైల‌ర్‌ను బ‌ట్టి తెలుస్తుంది. అడివి శేష్, రెజీనా, న‌వీన్ చంద్ర‌.. ఈ ముగ్గురి మ‌ధ్య న‌డిచే ఈ క‌థ చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటుంది. క్ష‌ణం సినిమా వ‌లే పెద్ద విజ‌యం సాధిస్తుంద‌నే అంచ‌నాల‌ను ఏర్ప‌రిచింది. మ‌రి... ఎవ‌రు ఎంతవ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ceiling fan: పరీక్షలు రాస్తుండగా వున్నట్టుండి.. సీలింగ్ ఫ్యాన్ ఊడిపడితే..?

వీవింగ్ ది ఫ్యూచర్-హ్యాండ్లూమ్ కొలోక్వియం సదస్సు నిర్వహణ

హోలీ పండుగ: మార్చి 14న మద్యం దుకాణాలు బంద్.. రంగులు అలా చల్లారో తాట తీస్తాం..

College student: కళాశాల విద్యార్థినిపై 16 నెలల పాటు ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం

Paddy: పెరుగుతున్న అప్పులు.. పొలంలోనే ఉరేసుకున్న సిద్ధిపేట రైతు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments