Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎవ‌రు' మ‌రో క్ష‌ణం అవుతుందా..? అడివి శేష్‌కి విజ‌యాన్ని అందిస్తుందా..?

Webdunia
మంగళవారం, 6 ఆగస్టు 2019 (18:35 IST)
అడివి శేష్, న‌వీన్ చంద్ర‌, రెజీనా ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందిన థ్రిల్ల‌ర్ ఎవ‌రు. ఈ చిత్రానికి వెంక‌ట్ రామ్ జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పీవీపీ సినిమాస్ బ్యానర్ పైన రూపొందిన ఈ మూవీని ఈ నెల 15న రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఎవ‌రు థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసారు. 
 
ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే... రెజీనాను రేప్ చేయబోయిన నవీన్ చంద్రను ఆమె కాల్చి చంపడంతో సినిమా ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. అయితే.. నిజంగానే అత్యాచారయత్నం జరిగిందా? లేక దీని వెనుక మరో కుట్ర ఉందా? అనే విషయాన్ని తేల్చేందుకు ఈ కేసును పోలీస్ అధికారి విక్రమ్ వసుదేవ్(అడవి శేష్)కు అప్పగిస్తారు. 
 
ఈ కేసును విక్రమ్ ఎలా సాల్వ్ చేశాడన్న సస్పెన్స్‌తో సినిమా కొనసాగుతుంది అనేది ట్రైల‌ర్‌ను బ‌ట్టి తెలుస్తుంది. అడివి శేష్, రెజీనా, న‌వీన్ చంద్ర‌.. ఈ ముగ్గురి మ‌ధ్య న‌డిచే ఈ క‌థ చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటుంది. క్ష‌ణం సినిమా వ‌లే పెద్ద విజ‌యం సాధిస్తుంద‌నే అంచ‌నాల‌ను ఏర్ప‌రిచింది. మ‌రి... ఎవ‌రు ఎంతవ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments