Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ వర్సెస్ రామ్ : నేటి నుంచి 'ఎవరు మీలో కోటీశ్వరుడు' కర్టన్ రైజర్ ఎపిసోడ్

Webdunia
ఆదివారం, 22 ఆగస్టు 2021 (15:01 IST)
టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ (రామ్), రామ్ చరణ్ (రామ్)లు ఒకే వేదికపై నుంచి కనిపించనున్నారు. ఈ ఇద్ద‌రు టాలీవుడ్ టాప్ హీరోలు మ‌రి కొద్ది రోజుల‌లో వెండితెర‌పై అద్భుతాలు సృష్టించ‌నుడ‌గా, ఆ లోపు బుల్లితెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధమయ్యారు. బిగ్ బి అమితాబ్ కౌన్ బనేగా కరోడ్ పతి తరహాలో 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' అనే కార్య‌క్ర‌మం రూపొంద‌గా, ఆదివారం క‌ర్ట‌న్ రైజ‌ర్ ఎపిసోడ్ జ‌ర‌గ‌నుంది.
 
ఇప్ప‌టికే ఈ షోకి సంబంధించి ప్రోమో విడుద‌ల కాగా, ఇది ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ఇద్దరు బడా హీరోలు ఒకసారి బుల్లితెరపై కనిపిస్తే అది విస్ఫోటనమే అవుతుంది. ఎవరు మీలో కోటీశ్వరులు ప్రారంభ ఎపిసోడ్‌కి రికార్డ్ స్థాయిలో టీఆర్పీ నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. 
 
ఆదివారం రాత్రి ప్ర‌సారం కానున్న ఎసిపోడ్ స్పెష‌ల్ కాగా, రేప‌టి నుండి రెగ్యుల‌ర్ ఎపిసోడ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ రోజు రాత్రి 8.30 నిల‌కు చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌కు సంబంధించిన కార్య‌క్ర‌మం ప్ర‌సారం కానుంది. తొలి ఎపిసోడ్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు. 
 
ఇదిలావుంటే, ఈ ఇద్దరు హీరోలు కలిసిన 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాంచరణ్ అల్లూరి పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

నడి రోడ్డుపై కానిస్టేబుల్‌పై బీర్ బాటిల్‌తో దాడి (Video)

Telangana tunnel tragedy: తెలంగాణ సొరంగంలో రెస్క్యూ పనులు.. మానవ అవశేషాల జాడలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments