Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆర్ఆర్ఆర్" కోసం "రిలీజ్ డేట్‌"ను త్యాగం చేస్తానంటున్న నిర్మాత!

Webdunia
ఆదివారం, 30 జనవరి 2022 (12:18 IST)
భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా నిర్మితమైన "ఆర్ఆర్ఆర్" చిత్రం. జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురావాల్సివంది. కానీ, కరోనా వైరస్ వ్యాప్తి, కరోనా ఆంక్షలు, రాత్రిపూట కర్ఫ్యూ, థియేటర్లలో 50 శాతం సీటింగ్ కెపాసిటీ వంటి కారణాలతో ఈ చిత్రం విడుదలను వాయిదా వేశారు. మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో విడుదల చేయనున్నట్టు తాజాగా ఆ చిత్రం నిర్మాత డీవీవీ దానయ్య వెల్లడించారు. 
 
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌, అజయ్ దేవగణ్ వంటి భారీ తారాగణం నటించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌ స్థాయి పెరగాలని, ఇందుకోసం పాన్ ఇండియా సినిమాలు విడుదల కావాలని కోరారు. ఈ విషయంలో తన చిత్రాల విడుదల తేదీలను త్యాగం చేస్తానని ప్రకటించారు. ఇందులోభాగంగా తన చిత్రం "ఎఫ్-3"ని విడుదలను వాయిదా వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. 
 
"ఆర్ఆర్ఆర్" చిత్రానికి మార్చి 18, ఏప్రిల్ 28వ తేదీ అనే రెండు తేదీలను ప్రకటించారు. మా ఎఫ్-3 28వ తేదీన రిలీజ్ చేయాలని అనుకున్నాం. ఒకవేళ "ఆర్ఆర్ఆర్" చిత్రం ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ చేస్తే మాత్రం తమ చిత్రాన్ని వాయిదా వేస్తామని తెలిపారు. ఈ విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే. అందరూ కూర్చొని విడుదల తేదీలపై చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

పిఠాపురంలో పవన్‌కు కలిసొచ్చే ఆ సెంటిమెంట్?

దుస్తులు విప్పేసి బెంగుళూరు రేవ్ పార్టీ ఎంజాయ్... నేను లేనంటున్న నటి హేమ!!

రోదసీలోకి వెళ్లిన తొలి తెలుగు టూరిస్ట్ - ఎవరీ గోపీచంద్ తోటకూర

అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు సిక్సర్ కొడుతున్నారు : ప్రశాంత్ కిషోర్

కెనడాలో దారుణ పరిస్థితులు .. అంత్యక్రియలకు డబ్బులు లేక పెరిగిపోతున్న అనాథ శవాల సంఖ్య!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments