గేమ్ ఛేంజర్ ప్రి-రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పిన మాటలకు ఆయనకు పాదాభివందనం చేయాలని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఆయన మాట్లాడుతూ... ''వకీల్ సాబ్ చిత్రం డబ్బింగ్ మూవీ అయినప్పటికీ పవన్ గారికి తగ్గట్లుగా కథను మార్చి తీయాలనుకున్నామనీ, ఆ విషయం ఆయనతో చెప్పి అడ్వాన్స్ ఇచ్చి వచ్చేసాను. ఐతే ఆయన ఫంక్షనులో పబ్లిక్గా నేను ఇచ్చిన డబ్బులే జనసేన పార్టీకి ఇంధనంగా మారిందని చెప్పినప్పుడు నా కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. అలా ఎవ్వరూ బయటకు చెప్పరు. అలాంటిది ప్రజల ముందు అలా చెప్పడాన్ని చూస్తే ఆయనకు పాదాభివందనం చేయాలి'' అని అన్నారు.