Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ధృవ నక్షత్రం'తో ఆ దర్శకుడు కుస్తీలు... ఎప్పుడు పొడుస్తుందో?

Webdunia
శుక్రవారం, 28 డిశెంబరు 2018 (16:16 IST)
గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తొలి చిత్రాన్ని ప్లాన్ చేసి, దానికి 'ధృవ నక్షత్రం' అని టైటిల్ పెట్టారు. దాదాపు రెండేళ్ల క్రితం షూటింగ్ మొదలైన ఈ సినిమాకు అప్పట్లోనే ఫస్ట్‌లుక్‌, టీజర్‌ విడుదల చేసారు. సాధారణంగా గౌతమ్ మీనన్ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉంటాయి, అదీ కాకుండా వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది మొదటి సినిమా కావడంలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. 
 
కానీ ఈ చిత్రం షూటింగ్ మొదలై ఇప్పటికే రెండేళ్లు దాటిపోతోంది, ఈ వ్యవధిలో విక్రమ్ హీరోగా నటించిన రెండు సినిమాలు కూడా విడుదలయ్యాయి. మొదట్లో శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఎందుకో అనుకున్నంత వేగంగా విడుదల కాలేదు. ఆర్థిక సమస్యలు తలెత్తడంతోనే ఆలస్యం జరుగుతున్నట్లు సినీవర్గాల సమాచారం.
 
ఇప్పుడు విక్రమ్, శృతి హాసన్ హీరోహీరోయిన్లుగా కమల్‌హాసన్‌ నిర్మిస్తున్న 'కడారం కొండాన్‌' చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో 'ధృవనక్షత్రం' షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని గౌతమ్‌మీనన్‌ ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. 'కడారం కొండాన్‌' పూర్తయిన వెంటనే 'ధృవనక్షత్రం' షూటింగ్‌‌ను పూర్తి చేసి విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రీతూవర్మ నటిస్తున్నారు. రానున్న సంవత్సరంలో అయినా ఈ సినిమాకు మోక్షం కలుగుతుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments