Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔను.. వాళ్లిద్దరూ ఇంకా విడాకులు తీసుకోలేదు... కస్తూరి రాజా

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (17:41 IST)
కోలీవుడ్ స్టార్ ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌లు విడాకులు తీసుకోబోతున్నట్టు ఈ దంపతులిద్దరూ వేర్వేరుగా ప్రకటించారు. కానీ, ధనుష్ తండ్రి, తమిళ సినీ దర్శకుడు కస్తూరి రాజా మాత్రం మరోలా స్పందించారు. ధనుష్, ఐశ్వర్య దంపతులు ఇంకా విడాకులు తీసుకోలేదని చెప్పారు. 
 
కేవలం వారిద్దరి మధ్య ఏర్పడిన చిన్నపాటి మనస్పర్థల కారణంగా తీవ్రమైన మానసికవేదనతో వారిద్దరూ అలాంటి నిర్ణయం తీసుకున్నారన్నారు. పైగా, వారిద్దరూ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉన్నారని, వారితో చెన్నైకు తిరిగి వచ్చిన తర్వాత వారిరద్దరినీ ఒక చోట చేర్చి మాట్లాడుతామన్నారు.  
 
"అన్ని కుటుంబాల్లో ఉన్నట్టుగానే ధనుష్, ఐశ్వర్య మధ్య కూడా చిన్నపాటి కలహాలు ఉన్నాయి. అవి ముగిసేవి కావు. నేను ఇద్దరితోనూ ఫోన్లో మాట్లాడాను. కొన్ని సలహాలు కూడా ఇచ్చాను" అని చెప్పారు. "వీరిద్దరిని సమాధానపరిచి తిరిగి ఒక్కటి చేసేందుకు తనతో పాటు తమ కుటుంబ సభ్యులు, రజనీకాంత్ తరపు బంధువులు ప్రయత్నిస్తున్నామని" చెప్పారు. 
 
కాగా, 18 యేళ్ళ వివాహం బంధం తర్వాత ఎవరివారు తమ మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నామని ధనుష్ ప్రకటించడం, ఆ తర్వాత ఐశ్వర్య కూడా ఇదే విషయాన్ని తన ఇన్‌స్టా ఖాతాలో వెల్లడించడం జరిగింది. గత 2004లో ప్రేమించి పెళ్ళి చేసుకున్న వీరిద్దరికీ యాత్రా, లింగా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య స్నానం చేస్తుండగా న్యూడ్ వీడియో తీసిన భర్త.. డబ్బు కోసం బెదిరింపులు...

గాల్లో గెలిచిన గాలి నాకొడుకులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు : ఆర్కే రోజా

ప్రియుడితో సుఖంగా జీవించు... భార్యను సాగనంపిన భర్త...

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments