గీతా ఆర్ట్స్‌లో డిజైనర్‌ అని మోసం చేశాడు.. బన్నీతో నటించే ఛాన్స్ ఇప్పిస్తానని?

Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (11:53 IST)
యువతులను మోసం చేసే ప్రబుద్ధుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మహిళలపై అకృత్యాలు ఓ వైపు పెరిగిపోతుంటే.. మరోవైపు ఇలాంటి మోసాల సంఖ్య కూడా పెరుగుతోంది.

ఇటీవల ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి పేరు చెప్పి అమ్మాయిలని మోసం చేసిన విషయం వెలుగులోకి రాగా, తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ పేరుతో అమ్మాయిలకు ఓ ప్రబుద్ధుడు వల వేశాడు. గీతా ఆర్ట్స్‌లో తాను డిజైనర్, మేకప్ మేన్‌ అని చెప్పుకుంటూ అమ్మాయిలకి అనేక మాటలు చెప్పి మోసం చేశాడు.
 
ఈ విషయం గీతా ఆర్ట్స్ బేనర్ దృష్టికి రావడంతో వెంటనే గీతా ఆర్ట్స్ మేనేజర్ సత్య సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మోసం చేసిన వ్యక్తి వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడడంతో అతని లోకేషన్ ట్రేసింగ్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. 
 
దీనిపై విచారణ శరవేగంగా జరుగుతుందని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. దర్యాప్తులో నిందితుడు.. పలువురు యువతులను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం ఇప్పిస్తానని మోసం చేసినట్లు తేలింది. ఇంకా యువతుల నుంచి భారీ మొత్తాన్ని గుంజేసివుంటాడని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments