Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నటి మీరా చోప్రా కేసు ఢిల్లీకి బదిలీ.. కారణం ఏమిటంటే?

Advertiesment
నటి మీరా చోప్రా కేసు ఢిల్లీకి బదిలీ.. కారణం ఏమిటంటే?
, శుక్రవారం, 5 జూన్ 2020 (11:13 IST)
Meera Chopra
సినీ నటి మీరా చోప్రా కేసు ఢిల్లీకి బదిలీ అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై మీరా చోప్రా సైబర్ క్రైమ్ బ్రాంచ్‌ను ఆశ్రయించింది. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో మీరా చోప్రా ప్రస్తుతం ఢిల్లీలో ఉండడంతో కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. 
 
ఇటీవల సోషల్ మీడియాలో చిట్‌చాట్‌లో పాల్గొన్న మీరా చోప్రా తనకు ఎన్టీఆర్ కంటే మహేశ్‌బాబు అంటే ఇష్టమని పేర్కొన్నారు. అంతేగాకుండా ఎన్టీఆర్ గురించి తెలియదన్నారు. దీంతో ఆమె వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. ట్విట్టర్ వేదికగా ఆమెను దుమ్మెత్తిపోయడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
 
దీంతో స్పందించిన నటి ట్విట్టర్ ద్వారా హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎనిమిది ఖాతాల నుంచే ఆమెకు అసభ్యకరమైన సందేశాలు వచ్చినట్టు గుర్తించారు. కాగా, నటి ఫిర్యాదుపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇంకా ''67ఎ''ను కూడా జతచేసిన పోలీసులు... మీరా చోప్రా ప్రస్తుతం ఢిల్లీలో ఉండడంతో కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్టు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గీతా ఆర్ట్స్‌కి షాక్ ఇచ్చిన నాగార్జున..!