Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి 'ఆచార్య' రిలీజ్ ఎపుడో చెప్పేశారు!

Webdunia
బుధవారం, 4 నవంబరు 2020 (15:07 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కరోనా లాక్డౌన్ కారణంగా ఆగిపోయింది. ఇపుడు తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, ఈ నెల 9వ తేదీ నుంచి చిత్రం షూటింగ్ తిరిగి మొదలవుతుందని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సోషల్ మీడియాలో బుధవారం అధికారికంగా ప్రకటించింది.
 
లాక్డౌన్ అనంతరం, పక్కాగా రక్షణ చర్యలు తీసుకుని, ఈ నెల 9 నుంచి తిరిగి షూటింగును నిర్వహించడానికి ఉత్తేజభరితంగా ఉన్నామని సదరు సంస్థ తెలిపింది. ఇది నెల రోజుల భారీ షెడ్యూలనీ, ఇందులో చాలా భాగం చిత్రీకరణ పూర్తవుతుందన్నారు. అలాగే ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లో సందడి చేస్తుందని విడుదల విషయాన్ని కూడా ప్రకటించారు.
 
కాగా, సామాజిక ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే చిత్ర నిర్మాత, హీరో అయన రాం చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. గతంలో చిరంజీవికి పలు సినిమాలలో హిట్ మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మ దీనికి సంగీతాన్ని అందిస్తున్నారు. రాం చరణ్, నిరంజన్ రెడ్డి కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments