Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి 'ఆచార్య' రిలీజ్ ఎపుడో చెప్పేశారు!

Webdunia
బుధవారం, 4 నవంబరు 2020 (15:07 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కరోనా లాక్డౌన్ కారణంగా ఆగిపోయింది. ఇపుడు తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, ఈ నెల 9వ తేదీ నుంచి చిత్రం షూటింగ్ తిరిగి మొదలవుతుందని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సోషల్ మీడియాలో బుధవారం అధికారికంగా ప్రకటించింది.
 
లాక్డౌన్ అనంతరం, పక్కాగా రక్షణ చర్యలు తీసుకుని, ఈ నెల 9 నుంచి తిరిగి షూటింగును నిర్వహించడానికి ఉత్తేజభరితంగా ఉన్నామని సదరు సంస్థ తెలిపింది. ఇది నెల రోజుల భారీ షెడ్యూలనీ, ఇందులో చాలా భాగం చిత్రీకరణ పూర్తవుతుందన్నారు. అలాగే ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లో సందడి చేస్తుందని విడుదల విషయాన్ని కూడా ప్రకటించారు.
 
కాగా, సామాజిక ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే చిత్ర నిర్మాత, హీరో అయన రాం చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. గతంలో చిరంజీవికి పలు సినిమాలలో హిట్ మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మ దీనికి సంగీతాన్ని అందిస్తున్నారు. రాం చరణ్, నిరంజన్ రెడ్డి కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

ఏపీలో పోలింగ్ తర్వాత తిరుమలకు రేవంత్ రెడ్డి

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments