Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎన్నియల్లో.. ఎన్నియల్లో.. ఎందాకా...' ఆనంద్ గొంతు పాడిన పాటకు నేను నర్తించాను...

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (12:36 IST)
ప్రముఖ తెలుగు సినీ నేపథ్య గాయకుడు జి. ఆనంద్ కరోనా వైరస్ సోకి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కరోనాతో బాధపడుతూ వచ్చిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలియగానే చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 
 
అలాంటివారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఆనంద్‌తో తనకున్న అనుబంధాన్ని ఆయన నెమరువేసుకున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఖాతాలో తన సంతాపాన్ని తెలిపారు. 
 
‘ఎన్నియల్లో... ఎన్నియల్లో... ఎందాకా… అంటూ నా సినీ జీవితంలో తొలి పాటకి గాత్ర దానం చేయడం ద్వారా నాలో ఒక భాగమైన మృదు స్వభావి, చిరు దరహాసి జి.ఆనంద్. ఈయన కర్కశమైన కరోనా బారిన పడి ఇక లేరు అని నమ్మలేకపోతున్నాను. 
 
మొట్ట మొదటి సారి వెండి తెరమీద ఆయన గొంతు పాడిన పాటకే నేను నర్తించాననే విషయం, ఆయనతో నాకు ఒక అనిర్వచనీయమైన, అవినాభావ బంధం ఏర్పరిచింది. ఆయన ప్రస్థానం నన్ను వెంటాడే విషాదం. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా సంతాపం తెలియచేసుకుంటున్నాను’ అంటూ చిరు ట్వీట్ చేశాడు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments