మేనక మేడమ్ గారు.. ఏం చెయ్యమంటారు.. ట్యాగ్ చేసిన చిన్మయి (video)

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (12:50 IST)
దేశంలో వైరల్ అయిన మీటూ ఉద్యమం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ గాయని, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి శ్రీపాద మీటూ పేరుతో ఉద్యమాన్ని వెలుగులోకి తెచ్చారు. తమిళ సినీరంగంలో అవార్డు విన్నింగ్‌ రచయితగా, సెలబ్రిటీగా వెలుగొందుతున్న సినీ రచయిత వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేశారు చిన్మయి. అంతేకాదు తన లాంటి అనేకమంది బాధితుల గోడును వెలుగులోకి తీసుకొచ్చారు. 
 
ఇంకా వారికి మద్దతుగా నిలిచారు. దీంతోపాటు ప్రముఖ నటుడు, తమిళనాడు ఫిలిం డబ్బింగ్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ రాధా రవిపై లైంగిక ఆరోపణలు చేసిన బాధితులకు కూడా చిన్నయి బహిరంగ మద్దతును ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే ఇపుడు ఆమెకు కష్టాలు తెచ్చి పెట్టింది. చిన్మయిని తమిళ డబ్బింగ్‌ యూనియన్‌ నుంచి తొలగిస్తూ.. సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
 
తాజాగా చిన్మయి శ్రీపాద ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి మేనకా గాంధీని ట్యాగ్ చేశారు. వైరముత్తు తనను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేసి నాలుగు మాసాలైంది. ఇందులో తనకు న్యాయం జరగలేదని.. ఇంకా తనను సినీ ఇండస్ట్రీ నుంచి తప్పించారు. డబ్బింగ్ యూనియన్ నుంచి వెలివేశారు. ప్రస్తుతం తాను కేసు పెట్టలేని పరిస్థితిలో వున్నాను. 
 
తనకేమైనా దారి చూపండి అంటూ చిన్మయి సోషల్ మీడియా ద్వారా మోదీ, మేనకలను ట్యాగ్ చేస్తూ వెల్లడించారు. ఈ ట్వీట్‌పై మేనకా గాంధీ స్పందించారు. మీ కేసును జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లానని.. వివరాలను తనకు పంపించాలని చిన్మయిని కోరారు.
 
కాగా 18 ఏళ్ల వయసులో వైరముత్తు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని షాకింగ్‌ విషయాలను చిన్మయి బయటపెట్టారు. అప్పటినుంచి వైరముత్తుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా చిన్మయిని కోలీవుడ్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ యూనియన్‌ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అపుడు నన్ను ఓడించారు... ఇపుడు నా భార్యను గెలిపించండి...

భాగ్యనగరిలో వీధి కుక్కల బీభత్సం - ఎనిమిదేళ్ళ బాలుడిపై దాడి

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం