Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ నటుడు బాలాజీపై కిడ్నీ మోసం కేసు.. సీన్‌లోకి వచ్చిన శ్రీరెడ్డి

సినీ నటుడు బాలాజీపీ కిడ్నీ మోసం కేసు నమోదైంది. దీంతో బాధితురాలికి అండగా నిలబడేందుకు సినీ నటి శ్రీరెడ్డి ముందుకు వచ్చారు. ఫలితంగా ఇది చర్చనీయాంశంగా మారనుంది.

Webdunia
బుధవారం, 9 మే 2018 (14:19 IST)
సినీ నటుడు బాలాజీపీ కిడ్నీ మోసం కేసు నమోదైంది. దీంతో బాధితురాలికి అండగా నిలబడేందుకు సినీ నటి శ్రీరెడ్డి ముందుకు వచ్చారు. ఫలితంగా ఇది చర్చనీయాంశంగా మారనుంది.
 
ఈ కేసులోని వివరాలను పరిశీలిస్తే, సినీ, బుల్లితెర నటుడు బాలాజీ భార్య కృష్ణవేణికి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. దీంతో బాలాజీ కిడ్నీ దాతకోసం సంప్రదిస్తుండగా డబ్బు అవసరమైన భాగ్యలక్ష్మి అనే ఓ మహిళ తన కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో రూ.20 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు.
 
ఈ ఒప్పందంలో భాగంగా ముందస్తుగా రూ.3 లక్షల నగదును భాగ్యలక్ష్మికి బాలాజీ అందజేశాడు. ఆ తర్వాత ఆమె కిడ్నీ దానం చేయడంతో తన భార్యను బతికించుకున్నాడు. ఆ తర్వాత మిగిలిన డబ్బు ఇవ్వాలని బాలాజీని కిడ్నీదాత సంప్రదించగా, ఆమెను బెదిరించసాగాడు. దీంతో బాధిత మహిళ జూబ్లీహిల్స్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
ఈ విషయం తెలుసుకున్న నటి శ్రీరెడ్డి బాధితురాలికి బాసటగా నిలిచారు. ఆమెకు అన్ని విధాలుగా సహాయం చేయనున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసుస్టేషన్‌కు వచ్చిన బాలాజీ తన దగ్గర ఉన్న ఒప్పంద పత్రాలు, బ్యాంకు ఖాతా లావాదేవీల వివరాలను పోలీసులకు సమర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments