Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపు బొమ్మ ప్రణీతను వరిస్తున్న బాలీవుడ్ ఆఫర్లు..

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (18:21 IST)
బెంగళూరు భామ ప్రణీతకు టాలీవుడ్‌లో అంతగా ఆఫర్లు రావట్లేదు. అత్తారింటికి దారేది సినిమాకు తర్వాత ఆమెకు ఆఫర్లు అతకడం లేదు. తాజాగా బాలీవుడ్ పైనే ఫోకస్ పెడుతోంది. సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే ప్రణీతకు.. బీటౌన్‌లో క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి అగ్ర కథానాయకులతో పాటు.. విష్ణు, మనోజ్, సిద్ధార్థ్ వంటి కథానాయకులతోనూ నటించిన ప్రణీతను బాలీవుడ్ అవకాశాలు వరిస్తున్నాయి.
 
ప్రస్తుతానికి బాలీవుడ్‌లో మాత్రం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అందులో ఒకటి అజయ్‌ దేవగణ్‌తో 'భుజ్: ద ప్రైడ్ ఆఫ్ ఇండియా' కాగా.. మరొకటి పరేష్ రావెల్, శిల్పా శెట్టిల 'హంగామా-2'. ఈ రెండు సినిమాలలోనూ ప్రాధాన్యత గల పాత్రలలో కనిపించబోతుందట ఈ బెంగళూరు భామ.
 
ఈ సినిమాలతో పాటు లేటెస్ట్‌గా మరో బాలీవుడ్ ఆఫర్ ప్రణీత చెంతకు వచ్చిందట. 'భుజ్: ద ప్రైడ్ ఆఫ్ ఇండియా'లో కీలక పాత్రకే పరిమితమైన ప్రణీత.. ఈసారి అజయ్ దేవగణ్ సరసన హీరోయిన్‌గా నటించే ఆఫర్ చేజిక్కించుకుందట. త్వరలోనే.. అజయ్-ప్రణీత మూవీపై అనౌన్స్ మెంట్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఏదిఏమైనా.. బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్‌తో బిజీ అవుతోన్న ప్రణీతకు.. హిందీ చిత్ర పరిశ్రమ ఎలా కలిసొస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments