Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ డ్రగ్స్ కలకలం: అర్జున్ రాంపాల్ ఇంట్లో ఎన్సీబీ అధికారులు సోదా

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (19:03 IST)
డ్రగ్స్ భూతం బాలీవుడ్‌ను కుదిపేస్తుంది. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీ వుడ్లో డ్రగ్స్ కలకలం మొదలైంది. దీంతో రంగంలోకి దిగిన ఎన్సీబీ అధికారులు పలువురిపై కేసు నమోదు చేశారు. విచారణలు జరిపారు.
 
ఈ నేపథ్యంలో మరో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఇంట్లో ఎన్సీబీ అధికారులు సోదా మొదలు పెట్టారు. నిన్న బాలీవుడ్ నిర్మాత ఫిరోజ్ నడియాడ్‌వాలా భార్యను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వారి ఇంటిపై జరిపిన సోదాలో సుమారు 10 గ్రాముల మరిజువానా బయటపడటంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
 
ఈ సందర్భంగా ఎన్సీబీ అధికారి సమీర్ మాట్లాడుతూ నడియాడ్‌వాలాకు సమన్లు జారీ చేశామని తెలిపారు. అయితే ఇంతవరకు అరెస్ట్ చేయలేదని తెలిపారు. ఐతే ఇటీవల ఓ డ్రగ్స్ సరఫరాదారుడిని అరెస్ట్ చేశామని తెలిపారు.
 
మరో వైపు సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి కూడా దాదాపు నెల రోజులు జైలు జీవితం గడిపి బెయిలుపై విడుదలైన సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ తదితరులు కూడా ఎన్సీబీ విచారణను ఎదుర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

నెలమంగళం టోల్‌ప్లాజాలో అరాచకం... (Video)

ఆ 5 కేజీల బంగారు ఆభరణాలను చోరీ చేసింది పోలీసులేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments