Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ డ్రగ్స్ కలకలం: అర్జున్ రాంపాల్ ఇంట్లో ఎన్సీబీ అధికారులు సోదా

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (19:03 IST)
డ్రగ్స్ భూతం బాలీవుడ్‌ను కుదిపేస్తుంది. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీ వుడ్లో డ్రగ్స్ కలకలం మొదలైంది. దీంతో రంగంలోకి దిగిన ఎన్సీబీ అధికారులు పలువురిపై కేసు నమోదు చేశారు. విచారణలు జరిపారు.
 
ఈ నేపథ్యంలో మరో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఇంట్లో ఎన్సీబీ అధికారులు సోదా మొదలు పెట్టారు. నిన్న బాలీవుడ్ నిర్మాత ఫిరోజ్ నడియాడ్‌వాలా భార్యను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వారి ఇంటిపై జరిపిన సోదాలో సుమారు 10 గ్రాముల మరిజువానా బయటపడటంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
 
ఈ సందర్భంగా ఎన్సీబీ అధికారి సమీర్ మాట్లాడుతూ నడియాడ్‌వాలాకు సమన్లు జారీ చేశామని తెలిపారు. అయితే ఇంతవరకు అరెస్ట్ చేయలేదని తెలిపారు. ఐతే ఇటీవల ఓ డ్రగ్స్ సరఫరాదారుడిని అరెస్ట్ చేశామని తెలిపారు.
 
మరో వైపు సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి కూడా దాదాపు నెల రోజులు జైలు జీవితం గడిపి బెయిలుపై విడుదలైన సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ తదితరులు కూడా ఎన్సీబీ విచారణను ఎదుర్కొన్నారు.

సంబంధిత వార్తలు

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments