తమ్ముడుని కాపాడుకునేందుకు దిల్ రాజు నాపై నిందలు వేశారు... అత్తి

ఠాగూర్
బుధవారం, 28 మే 2025 (16:14 IST)
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సోదరుడు శిరీష్‌ను కాపాడుకునేందుకు తనపై నిందలు వేశారని జనసేన పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కాకినాడకు చెందిన అత్తి సత్యనారాణ సంచలన ఆరోపణలు చేశారు. 
 
జూన్ ఒకటో తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్‌ పాటించాలంటూ అత్తి సత్యనారాయణ తొలుత ప్రతిపాదన చేశారని దిల్ రాజు ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో జనసేన పార్టీ నుంచి అత్తిని సస్పెండ్ చేశారు. దీనిపై అతితి సత్యనారాయణ మాట్లాడుతూ, దిల్ రాజు అతని తమ్ముడుని కాపాడుకోవడానికి తనపై నిందలు వేశారన్నారు. 
 
గత నెలలో జరిగిన సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశంలో సినిమా థియేటర్ల బంద్ అంశం తాను ప్రతిపాదన చేయలేదన్నారు. థియేటర్ల బంద్ అని ప్రకటించిందే దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి అని, అతన్ని కాపాడుకునేందుకు దిల్ రాజు తనపై నిందలు వేశారన్నారు. దిల్ రాజు కమల్ హాసన్‌ను మించిపోయేలా నటించారన్నారు.
 
తమ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎపుడైతే సీరియస్ అయ్యారో జనసేన పార్టీ పేరును ఉద్దేశ్యపూర్వకంగానే ఆయన తెరపైకి తెచ్చారని అత్తి సత్యనారాయణ ఆరోపించారు. కాగా, థియేటర్ల బంద్ అంశం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెల్సిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్‌ను మరో గోవా చేయాలి... భర్త పెగ్గేస్తే భార్య ఐస్ క్రీమ్ తినేలా చూడాలి : సీహెచ్ అయ్యన్నపాత్రుడు

పరకామణి చోరీ : ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్‌ను గొడ్డలితో నరికి చంపేశారు

నౌగామ్ పోలీస్ స్టేషనులో భారీ పేలుడు... 9 మంది మృత్యువాత

స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments