టాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ కార్తీక్ అదృశ్యం!

Webdunia
మంగళవారం, 24 నవంబరు 2020 (10:10 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఓ సహాయ దర్శకుడు కనిపించకుండా పోయారు. ఆయన పేరు కార్తీక్ (24). కార్తీక్ అదృశ్యంపై ఆయన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల మేరకు... యూసుఫ్‌గూడ మధురానగర్‌కు చెందిన కార్తీక్ (24) టాలీవుడ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 20న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లిన కార్తీక్ ఆ తర్వాతి రోజు బయలుదేరి నగరానికి చేరుకున్నాడు. అయితే, ఇంటికి వెళ్లకుండా నేరుగా మాదాపూర్‌లోని స్నేహితుల వద్దకు వెళ్లాడు.
 
ఆ తర్వాత స్నేహితులతో కలిసి పంజాగుట్ట చేరుకున్న కార్తీక్ ఇంటికి తిరిగి వెళ్లలేదు. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే అది స్విచ్చాఫ్ అని వచ్చింది. ఆ తర్వాత అతని కోసం విస్తృతంగా గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో కార్తీక్ తండ్రి ఉత్తరాది లక్ష్మీనారాయణ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
కార్తీక్ ఇటీవల తన స్నేహితులు వంశీ, క్రాంతి, నివాస్ తదితరులతో కలిసి ఓ టీవీ చానల్‌లో కార్యక్రమం కోసం రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టించాడని, ఆ తర్వాత స్నేహితుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆందోళనకుగురై ఎటో వెళ్లిపోయి ఉంటాడని లక్ష్మీనారాయణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఆ ప్రభుత్వం వుంది.. మనం బుల్లెట్ రైలులా దూసుకెళ్తున్నాం: నారా లోకేష్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. సునీత కోసం ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారా?

Pepper Spray: తరగతి గదిలో పెప్పర్ స్ప్రే.. ఆస్పత్రిలో తొమ్మిది మంది విద్యార్థులు, టీచర్లు

విశాఖలో గూగుల్ ఆర్టిఫిషియల్ హబ్ : ప్రశంసల వర్షం కురిపించిన జేపీ

పిల్లలకు విషం ఇచ్చాడు.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments