Webdunia - Bharat's app for daily news and videos

Install App

'శ్రీమంతుడు' చిత్రాన్ని 70 సార్లు చూసిన డీజీపీ ఎవరు?

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం శ్రీమంతుడు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. పైగా, ఈ చిత్రాన్ని చూసిన పలువురు ప్రముఖులు పలు గ్రామాలను దత్తత తీసుక

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2017 (10:45 IST)
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం శ్రీమంతుడు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. పైగా, ఈ చిత్రాన్ని చూసిన పలువురు ప్రముఖులు పలు గ్రామాలను దత్తత తీసుకున్నారు. అంతేనా అనేక మంది అనేక సార్లు ఈ చిత్రాన్ని చూశారు. అలా రాష్ట్ర డీజీపీ ఈ చిత్రాన్ని ఏకంగా 70 సార్లు చూశారట. ఆ డీజీపీ ఎవరో కాదు... నండూరి సాంబశివరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ. 
 
గుంటూరులో శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పోలీసు కుటుంబాల విద్యార్థులకు డీజీపీ ఉపకార వేతనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, శ్రీమంతుడు చిత్రంలో చివర్లో జగపతిబాబు చెప్పే ఓ డైలాగు తనకు బాగా ఇష్టమన్నారు. 
 
"అందరూ వాడు పుట్టాడ్రా, వీడు పుట్టాడ్రా అంటారుగానీ, మంచోడు పుట్టాడ్రా నాకు" అన్న డైలాగ్‌ను చెప్పారు. విద్యార్థులు తమను తాము దిద్దుకోవాలని పిలుపునిచ్చారు. మత్తుకు తమ పిల్లలు బానిసలు కావడం పట్ల వారి తల్లిదండ్రుల ప్రమేయం కూడా ఉంటుందని అన్నారు. 
 
పోలీసులు సాధారణంగానే కఠినంగా ఉంటారని, వారి విధి నిర్వహణా బాధ్యతలు అటువంటివని చెప్పారు. పోలీసులు తమ పిల్లల్ని మిగతావారికన్నా అత్యుత్తమంగా పెంచాలని పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments