Webdunia - Bharat's app for daily news and videos

Install App

''యాత్ర''లో అనసూయ స్టిల్ వచ్చేసింది.. షర్మిలగా కనిపించనుందా? (video)

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (18:29 IST)
యాంకరింగ్‌తో పాటు సినిమాల్లో వైవిధ్య పాత్రలను ఎంచుకుంటూ.. ముందుకెళ్తున్న రంగమ్మత్త.. తాజాగా ''యాత్ర'' సినిమాలో నటిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితాధారంగా వస్తున్న ''యాత్ర''లో అనసూయ కీలక పాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం. మహి వి. రాఘవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రాజశేఖర్‌ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి నటిస్తున్నారు. 

ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాలో అనసూయ కర్నూలుకు చెందిన రాజకీయ నాయకురాలిగా నటించనున్నారని వార్తలొచ్చాయి. కానీ ప్రస్తుతం విలేకరిగా కన్పించనున్నట్లు టాక్ వస్తోంది. తాజాగా సెట్‌లో కుర్చీలో కూర్చుని ఉన్నప్పుడు తీసిన ఫొటోను అనసూయ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ఈ ఫోటోలో అనసూయ గెటప్ చూస్తుంటే..  యాత్రలో షర్మిల పాత్రను ఆమె పోషిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
అంతేగాకుండా ఈ సినిమాలో రావు రమేష్, సుహాసిని, జగపతి బాబు కీలక పాత్రలో కనిపిస్తున్నారని సమాచారం. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని, వైఎస్సార్‌ సన్నిహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేశ్‌ కనిపించనున్నారట. అయితే దీనికి సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రతి పాత్ర ప్రేక్షకుల మనసుల్ని హత్తుకునేలా తెరకెక్కించినట్లు గతంలో దర్శకుడు రాఘవ్‌ వెల్లడించారు. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వైఎస్సార్‌ కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజుని పురస్కరించుకుని డిసెంబరు 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
 
ఇప్పటికే అనసూయ చేసే టీవీ షోలు టాప్ రేటింగ్‌లో వున్నాయి. ''రంగస్థలం'' సినిమాతో అనసూయకు మంచి గుర్తింపు వచ్చింది. ఈమె కోసమే దర్శకులు కీలక పాత్రలను క్రియేట్ చేస్తున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. తాజా ''యాత్ర''తో కూడా ఆమె క్రేజ్ మరింత పెరుగుతుందని.. మరిన్ని సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తాయని సినీ జనం చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏలూరు కలెక్టరేట్‌లో కరోనా కలకలం- ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్

హౌస్ కీపింగ్ యువకుడికి ఐ లవ్ యు చెప్పిన లేడీ డాక్టర్, ఆ తర్వాత ఏం జరిగింది?

Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?

Mega DSC: మెగా డీఎస్సీ-2025 పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు.. ఏపీ సర్కారు

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments