మెదడు లేని మూర్ఖులే అలాంటి పిచ్చి రాతలు రాస్తారు : అమితాబ్ బచ్చన్

ఠాగూర్
సోమవారం, 9 డిశెంబరు 2024 (11:38 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు కోపమొచ్చింది. తన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్‌లు విడిపోతున్నారంటూ సాగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. మెదడులేని మూర్ఖులే పిచ్చిరాతలు రాస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ తప్పులను దాచి ఇతరుల లోపాలను వెతుకుతారంటూ ట్వీట్ చేశారు. 
 
నిజానికి బాలీవుడ్ సెలబ్రెటీ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ విడిపోతున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈ జంట ఎవరికి వారుగా ఫంక్షన్లకు హాజరు కావడం, ఒంటరిగానే ప్రయాణాలు చేస్తూ కనిపించడం ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. తాజాగా ఈ ప్రచారంపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పరోక్షంగా స్పందించారు. 
 
సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో ఈ రూమర్స్ ప్రచారం చేస్తున్న వారిపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రపంచంలో మూర్ఖులకు కొదవలేదని, మనం ఏం మాట్లాడినా దానికి కుత్సిత మెదడుతో తమకు కావాల్సిన అర్థిం తీస్తారని విమర్శించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకుంటూ ఇతరులలో లేని లోపాలను వెతుకుతుంటారని అన్నారు.
 
మెదడులేని ఇలాంటి వ్యక్తుల రాతల వెనక వారి అజ్ఞానం, తెలివితక్కువతనం కనిపిస్తాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారి వారి వ్యక్తిగత జీవితాల్లోని దురదృష్టాలను దాచి, ఇతరుల మాటల్లో ప్రతీ పదానికీ పెడార్థం తీస్తారంటూ బిగ్ బీ ట్వీట్ చేశారు. 
 
కాగా, ఇటీవల అభిషేక్ బచ్చన్ ఓ ట్వీట్ చేస్తూ సుదీర్ఘ కాలం దాంపత్య జీవనం గడిపిన వారు కూడా విడాకులు తీసుకుంటున్న సంఘటనలు ఇటీవలి కాలంలో పెరిగాయని పేర్కొన్నారు. ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నిస్తూ ఓ సామాజిక సమస్యపై చర్చ కోసం చేసిన ఈ ట్వీట్‌ను ఆయన సొంత జీవితానికి ఆపాదించి అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నారంటూ ప్రచారం చేస్తున్నారని అమితాబ్ పరోక్షంగా చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments