Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెదడు లేని మూర్ఖులే అలాంటి పిచ్చి రాతలు రాస్తారు : అమితాబ్ బచ్చన్

ఠాగూర్
సోమవారం, 9 డిశెంబరు 2024 (11:38 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు కోపమొచ్చింది. తన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్‌లు విడిపోతున్నారంటూ సాగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. మెదడులేని మూర్ఖులే పిచ్చిరాతలు రాస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ తప్పులను దాచి ఇతరుల లోపాలను వెతుకుతారంటూ ట్వీట్ చేశారు. 
 
నిజానికి బాలీవుడ్ సెలబ్రెటీ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ విడిపోతున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈ జంట ఎవరికి వారుగా ఫంక్షన్లకు హాజరు కావడం, ఒంటరిగానే ప్రయాణాలు చేస్తూ కనిపించడం ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. తాజాగా ఈ ప్రచారంపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పరోక్షంగా స్పందించారు. 
 
సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో ఈ రూమర్స్ ప్రచారం చేస్తున్న వారిపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రపంచంలో మూర్ఖులకు కొదవలేదని, మనం ఏం మాట్లాడినా దానికి కుత్సిత మెదడుతో తమకు కావాల్సిన అర్థిం తీస్తారని విమర్శించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకుంటూ ఇతరులలో లేని లోపాలను వెతుకుతుంటారని అన్నారు.
 
మెదడులేని ఇలాంటి వ్యక్తుల రాతల వెనక వారి అజ్ఞానం, తెలివితక్కువతనం కనిపిస్తాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారి వారి వ్యక్తిగత జీవితాల్లోని దురదృష్టాలను దాచి, ఇతరుల మాటల్లో ప్రతీ పదానికీ పెడార్థం తీస్తారంటూ బిగ్ బీ ట్వీట్ చేశారు. 
 
కాగా, ఇటీవల అభిషేక్ బచ్చన్ ఓ ట్వీట్ చేస్తూ సుదీర్ఘ కాలం దాంపత్య జీవనం గడిపిన వారు కూడా విడాకులు తీసుకుంటున్న సంఘటనలు ఇటీవలి కాలంలో పెరిగాయని పేర్కొన్నారు. ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నిస్తూ ఓ సామాజిక సమస్యపై చర్చ కోసం చేసిన ఈ ట్వీట్‌ను ఆయన సొంత జీవితానికి ఆపాదించి అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నారంటూ ప్రచారం చేస్తున్నారని అమితాబ్ పరోక్షంగా చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments