Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాతకు డబ్బులు ఎగ్గొట్టి చిక్కుల్లో పడిన అమీషా పటేల్...

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (09:34 IST)
నిర్మాతకు చెల్లించాల్సిన డబ్బులు ఎగ్గొట్టిన బాలీవుడ్ నటి అమీషా పటేల్ చిక్కుల్లో పడింది. నిర్మాత అజయ్ కుమార్‌కు ఈమె కొంత నగదు ఇవ్వాల్సి వుంది. ఇందుకోసం చెక్‌ ఇచ్చింది. కానీ, బ్యాంకు ఖాతాలో డబ్బులు లేకపోవడంతో ఆ చెక్ బౌన్స్ అయింది. అలా ఆయన్ను మోసం చేసింది. దీంతో అజయ్ కుమార్ రాంచీ కోర్టులో ఫిర్యాదు చేశారు. 
 
గత యేడాది మార్చిలో రాంచీలో ఓ ఈవెంట్‌కి హాజరైన అమీషా పటేల్, ఆమె బిజినెస్ పార్టనర్ కున్నాల్ గ్రూమర్ తన దగ్గర రూ.2.5 కోట్లు అప్పుగా తీసుకుందని నిర్మాత అజయ్ కుమార్ తెలిపారు. రెండు, మూడు నెలల్లో వడ్డీతో కలిపి చెల్లిస్తామని చెప్పారని హామీ ఇచ్చారు.
 
ఆ తర్వాత 3 కోట్ల రూపాయల చెల్లని చెక్ ఇచ్చారని తెలిపారు. ఆ పిమ్మట వారిని సంప్రదిస్తే వారి నుంచి సరైన సమాధానం రాలేదని పేర్కొన్నారు. పైగా, పెద్దపెద్ద బడా నేతల ఫోటోలు చూపించి చంపేస్తానని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. దీన్ని కోర్టు విచారణకు స్వీకరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొక్కజొన్న తోటలో దారుణం : వేరొకరితో మాట్లాడుతుందని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు...

నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైకాపా అదృష్టం : ఆర్ఆర్ఆర్

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఉగ్రవాదులతో లింకులు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల డిస్మిస్

శారీరకంగా వాడుకుని తప్పించుకు తిరుగుతున్నాడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments