Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింత వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్ కేథరిన్ థ్రెసా

Webdunia
ఆదివారం, 20 అక్టోబరు 2019 (17:25 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించిన హీరోయిన్లలో కేథరిన్ థ్రెసా ఒకరు. తన అందంతో పాటు అభినయంతో కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టింది. 'ఇద్దరు అమ్మాయిలతో..', 'సరైనోడు' వంటి చిత్రాల్లో నటించిన ఈ గ్లామరస్ బ్యూటీ... ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. 
 
అయితే, టాలీవుడ్‌ చాలా సినిమాలే చేసినా ఈ అందాల భామకు ఆశించిన గుర్తింపు మాత్రం రాలేదు. అయితే కోలీవుడ్‌లో మాత్రం వరుస విజయాలతో స్టార్‌ హీరోయిన్‌గా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలో ఒక హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలు చెబుతూ.. వింత వ్యాధితో బాధపడుతున్నానని చెప్పింది ఈ అమ్మడు. ఈ జబ్బు కారణంగా చాలా సమస్యలు ఎదుర్కొంటుందట. ఇంతకీ ఈ బ్యూటీకి వచ్చిన జబ్బు ఏంటో తెలుసా.. అనోస్మియ. ఈ జబ్బు ఉన్న వారు వాసన చూడలేరు. ఎంత సువాసన అయినా.. ఎంత దుర్వాసన అయినా వారికి తెలియదు. వాసన చూసే శక్తి వారికి అస్సలు ఉండదు.
 
ఈ జబ్బు ఉన్న కారణంగా భవిష్యత్తులో సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో పెళ్లి చేసుకోకూడదని భావిస్తుందట. లక్షల్లో ఒక్కరికి వచ్చే ఈ జబ్బు కేథరిన్‌కు రావడం పట్ల ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ వింత జబ్బు తన నటనకు ఎలాంటి అడ్డు రావడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Thunderstorms: జూన్ 2 నుండి 4 వరకు ఏపీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

కర్నాటకలో దారుణం.. బేకరీలో వ్యక్తిని నరికి చంపిన దుండగులు

Kavamma: అమ్మవారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తూ గుండెపోటుతో కుప్పకూలి భక్తుడు మృతి (video)

Bihar: తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం- స్నాక్స్ ఇస్తానని తీసుకెళ్లి..?

గుండ్లపాడును వెంటాడుతున్న ఫ్యాక్షన్ భూతం.. ఆ గ్రామంలో 18 హత్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments