నాకు స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఆఫర్లు వచ్చాయి.. కోట్లిస్తానన్నారు.. కానీ వద్దన్నాను?

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (13:41 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ అల.. వైకుంఠపురములో. ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాని నిర్మించాయి. ఇందులో బన్నీ సరసన పూజా హేగ్డే నటించింది. ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ సక్సస్ అవ్వడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి కానుకగా ఈ నెల 12 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
ఇదిలా ఉంటే... ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ ఎలా మాట్లాడాడో... అందరికీ తెలిసిందే. బన్నీ అంతలా మాట్లాడడం హాట్ టాపిక్ అయ్యింది. నాన్న గురించి మాట్లాడడం... నాన్న అల్లు అరవింద్ కు పద్మశ్రీ ఇవ్వాలి అనడం చర్చనీయాంశం అయ్యాయి. వీటి గురించి అడిగితే... అలా మాట్లాడేసాను అంతే. ఏదీ ప్లాన్ చేసి మాట్లాడలేదు అన్నాడు. ఇది సరే... స్టేజ్ పై డ్యాన్స్ వేయడం గురించి అడిగితే... అసలు డ్యాన్స్ చేయాలని అనుకోలేదట.
 
ఫ్యాన్స్‌ని చూడగానే.. ఉత్సాహం అలా వచ్చేసింది. పాట పెట్టమని డ్యాన్స్ చేసేసాను అన్నాడు. ఈ సందర్భంగా మరో విషయాన్ని కూడా బయటపెట్టాడు అల్లు అర్జున్. ఇంతకీ మేటర్ ఏంటంటే...  స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఆఫర్లు తనకు చాలా వచ్చాయట. కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్లు కూడా ఇచ్చారని, కానీ... తను వాటిని రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చాడు. తనకు నచ్చితేనే స్టేజ్ పై డాన్స్ చేస్తానని స్పష్టం చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికా - ఇరాన్ శాంతి చర్చలకు దౌత్యం.. హోటల్ బిల్లు చెల్లించలేక చేతులెత్తేసిన పాక్

స్కానింగ్ చేస్తుండగా మొబైల్ ఫోన్ పేలిపోయింది.. ఎక్కడ?

విదేశాల్లో ఉద్యోగాలు.. నిరుద్యోగ యువత నుంచి లక్షలు గుంజేసిన ముఠా అరెస్ట్

180 మంది బాలికలపై లైంగికదాడి... 350కి పైగా అశ్లీల వీడియోలు.. బీజేపీ ఎంపీ ఫిర్యాదు

కన్నకుమార్తెను కిరాతకంగా హత్య చేసిన కన్నతల్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ పుచ్చకాయ తింటే తలనొప్పి వస్తుంది, ఎందుకని?

పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

మోచేతుల కింద నలుపు రంగు వదిలించుకునేదెలా?

కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్‌ను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఈ 5 జ్యూస్‌లు ఆరోగ్యానికి వరం

తర్వాతి కథనం
Show comments