Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెగా ఫ్యామీలీనే... నిలదొక్కుకునేందుకు అష్టకష్టాలు పడ్డాం : బన్నీ

మెగా ఫ్యామీలీనే... నిలదొక్కుకునేందుకు అష్టకష్టాలు పడ్డాం : బన్నీ
, శుక్రవారం, 10 జనవరి 2020 (19:04 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం అల వైకుంఠపురములో. ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్ కాగా, సీనియర్ నటి టబు, మలయాళ హీరో జయరాం తదితరులు నటించారు. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. 
 
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, తాము మెగా ఫ్యామిలీతో పాటు.. తన తండ్రి అల్లు అరవింద్ సినీ నిర్మాత కావడంతో చిత్రసీమలోకి సులభంగానే అడుగుపెట్టినప్పటికీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు చాలా కష్టాలుపడినట్టు చెప్పుకొచ్చారు. 
 
సినీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ తమ కష్టాలు తమకుంటాయని చెప్పారు. ఏది ఏమైనా స్వయంకృషితో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న నటులంటే తనకు ఎంతో గౌరవం అని బన్నీ చెప్పారు. వారిని చాలా గౌరవిస్తానని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. 
 
నిర్మాతను నేనే... అల్లు అయాన్ 
ఈ చిత్రం విడుదలకు మరికొన్ని గంటలే ఉన్న తరుణంలో చిత్ర యూనిట్ ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో హీరో అల్లు అర్జున్ తన భార్యాపిల్లలతో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా, బన్నీ కుమారుడు అల్లు అయాన్ మేకింగ్ వీడియోలో అల్లు అయాన్, కెమెరా నుండి చూస్తూ ఈ సినిమాకు నేనే నిర్మాత‌ను అని చెప్పి నిర్మాత‌ల‌కు షాకివ్వ‌డం కొస‌మెరుపు.
 
కాగా, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణలు సంయుక్తంగా గీతాఆర్ట్స్-2, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. అల వైకుంఠపురములో చిత్రానికి అద్భుతమైన సంగీత బాణీలను ఎస్. థమన్ సమకూర్చగా, ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఈ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసిన గంట వ్యవధిలోనే లక్షన్నర మంది నెటిజన్లు వీక్షించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''ఆర్ఆర్ఆర్'' షూటింగ్ వున్నా పర్లేదు.. బిగ్ బాస్‌కు వస్తా.. టైగర్