Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ జ్ఞాపకార్థం దుప్పట్లు పంచుతున్న అలీ

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (19:44 IST)
నటుడు అలీ తల్లి జైతూన్‌ బీబీ చనిపోయి నేటికి ఏడాది అయ్యింది. ఆమె సంవత్సరీకానికి ఏదన్నా చేయాలనుకున్నారు అలీ. ఈ విషయం గురించి అలీ మాట్లాడుతూ, ‘‘పేదవారికి, అనాథాశ్రమాలకు వెళ్లి భోజనం పెడితే ఒక్క పూటతో పోతుంది. అలా కాకుండా ఏం చేయాలి? అనుకున్నప్పుడు నాకో ఆలోచన వచ్చింది.
 
మా అమ్మ ఎప్పుడూ శాలువానో, దుప్పటో కప్పుకుని ఉండేది. ఇప్పుడు చలి ఎక్కువగా ఉంది. అందుకే  ఆమె జ్ఞాపకార్థం హైదరాబాద్‌లోని క్యాన్సర్‌ హాస్పిటల్‌ దగ్గర, బస్టాండ్‌ల వద్ద ఉండేవారికి దుప్పట్లు పంచాలనుకున్నాను. మా అమ్మ వెచ్చని జ్ఞాపకాలతో చేస్తున్న ఈ సాయం ఎందరినో చలి నుంచి కాపాడుతుంది.
 
ఇది పబ్లిసిటీ కోసం చెప్పటం లేదు. ఇలా ఎప్పటికప్పుడు నా వంతుగా ఏదొకటి చేయడం నాకు ఆత్మసంతృప్తినిస్తుంది’’ అన్నారు అలీ. తన తండ్రి మహమ్మద్‌ బాషా పేరు మీద ఏర్పాటు చేసిన ‘మహమ్మద్‌ బాషా చారిటబుల్‌ ట్రస్ట్‌’ ద్వారా అలీ ఈ సాయం అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments