Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతతో నా ఫ్యామిలీ గడిపిన ప్రతిక్షణం ఎంతో మధురమైనది.. నాగార్జున

Webdunia
ఆదివారం, 3 అక్టోబరు 2021 (11:04 IST)
టాలీవుడ్ దంపతులు అక్కినేని నాగ చైతన్య, సమంతలు వీడిపోవడంపై స్టార్ హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. వీరిద్దరూ విడిపోవడం దురదృష్టకరమన్నారు. ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాల్ ఓ పోస్ట్ చేశారు.
 
"చైతూ - సమంత విడిపోవడం దురదృష్టకరం. భార్యభర్తలు విడిపోవడం వారి వ్యక్తిగత విషయం' అంటూ పేర్కొన్నారు. సమంత ఫ్యామిలీ ఎల్లప్పుడూ తమకు ఆత్మీయులేనని, చైతు-సమంత ఎప్పటికీ తన గుండెల్లో ఉంటారని నాగార్జున చెప్పుకొచ్చారు.
 
‘ఎంతో బరువైన హృదయంతో ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోంది. చైతు-సమంత విడిపోవటం దురదృష్టకరం. భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వాళ్ల వ్యక్తిగతం. సమంత, నాగచైతన్య ఇద్దరూ నాకెంతో దగ్గరి వారు. 
 
సమంతతో నా కుటుంబం గడిపిన ప్రతి క్షణం ఎంతో మధురమైంది. ఆమె కుటుంబ సభ్యులు ఎల్లప్పుడు మాకు ఆత్మీయులే. దేవుడు వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి’అని నాగ్‌ ట్వీట్‌ చేశాడు. 
 
కాగా, చైతన్య-సమంత తాము విడిపోతున్నామని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. సమంతతో విడాకులు తీసుకోనున్నట్లు శనివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు చైతన్య. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రాఫిక్ పోలీస్ నుంచి తప్పించుకునే యత్నంలో బైకర్ అనంతలోకాలకు...

ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు... ఐఎండీ హెచ్చరిక

మూడు రోజుల క్రితం వివాహం... రౌడీ షీటర్ నడి రోడ్డుపై హత్య

క్షేమంగా ఇంటికి చేరుకున్న మార్క్.. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా

ప్రియురాలి భర్తను చంపేందుకు సుపారీ గ్యాంగ్‌తో కుట్ర... చివరకు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments