Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

ఠాగూర్
బుధవారం, 30 ఏప్రియల్ 2025 (13:20 IST)
తన కోసం తన భార్య షాలిని ఎన్నో త్యాగాలు చేసిందని, ఈ క్రెడిట్ అంతా ఆమెదే అని 'పద్మభూషణ్' అజిత్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇది తనకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య షాలినిపై ప్రశంసల వర్షం కురిపించారు. తన కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. 
 
'నేను ఇప్పటికీ సామాన్యుడిలానే ఆలోచిస్తాను. ఇంతటి విజయాన్ని సాధించినందుకు ఒక్కోసారి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ స్థాయిలో ఉండటానికి నా భార్య షాలినినే కారణం. ఆమె నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ప్రతి పనిలోనూ నాకు తోడుంటుంది. ఒక్కోసారి నేను సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయినా ఆమె నాకు అండగా నిలుస్తుంది. 
 
నన్ను ఎపుడూ నిరుత్సాహ పరచలేదు. నా కష్ట సమయాల్లో పక్కనే ఉండి భరోసానిచ్చింది. నా జీవితంలో సాధించిన సక్సెస్ క్రెడిట్ అంతా ఆమెకే ఇస్తాను. ఎంతో ప్రజాదారణ పొందిన నటి అయినప్పటికీ నా కోసం అన్నింటికీ దూరమైంది. ఆమెకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. 
 
నేను కేవలం నటుడుని మాత్రమే. నటన నాకు జీవితాన్నిచ్చే ఓ ఉద్యోగంగా భావిస్తాను. సూపర్ స్టార్ అని పిలిపించుకోవడం నచ్చదు. ఎందుకంటే అలాంటి ట్యాగ్స్‌పై నాకు నమ్మకం లేదు. 33 యేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. నా వృత్తిని ప్రేమిస్తాను. జీవితమంతా అభిమానులను ఆలరించడానికే ప్రయత్నిస్తాను. సాధ్యమైనంతవరకు సాదాసీదాగా ఉంటాను. అతిగా ఆలోచించను. ఒకేసారి ఎక్కువ ప్రాజెక్టులు అంగీకరించను. నటనతో పాటు నా ఇతర ఆసక్తులపై కూడా దృష్టిసారిస్తాను' అని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఈవో పోస్టుకు ఎసరు పెట్టిన ఉద్యోగితో ప్రేమ!!

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

కర్నూలులో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments