Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనామా పత్రాల లీక్ కేసు : ఈడీ ప్రశ్నలతో ఐశ్వర్య ఉక్కిరిబిక్కిరి

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (07:15 IST)
పనామా పత్రాల లీక్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు ఆమైపై ప్రశ్నల వర్షం సంధించారు. దీంతో ఆమె ఏం సమాధానం చెప్పాలో తెలియక ఉక్కిరిబిక్కిరయ్యారు. 
 
ఈ పనామా పత్రాల లీక్ వ్యవహారంలో విచారణకు హాజరుకావాలని గతంలో ఈడీ అధికారులు రెండుసార్లు నోటీసులు జారీచేశారు. కానీ, ఆ సమయంలో ఆమె హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఉన్నట్టుండి మరోమారు విచారణకు రావాల్సిందేనంటూ నోటీసులు జారీచేశారు. 
 
అయితే, ఈ రోజు విచారణకు రాలేనని ఆమె చెప్పినప్పటికీ ఈడీ అధికారులు మాత్రం అంగీకరించలేదు. దీంతో ఆమె సోమవారం ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఆ సమంయలో ఆమె నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు ఈడీ అధికారులు ప్రశ్నించారు. దాదాపు ఆరు గంటల పాటు ఆమె వద్ద విచారణ సాగింది.
 
ఈ వ్యవహారంపై ఐశ్వర్య అత్త, రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే బీజేపీకి దుర్ధినాలు రానున్నాయని ఆమె శాపనార్థాలు పెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తాడేపల్లి వైసిపి ఆఫీసుని అంత అర్జంటుగా ఎందుకు కూల్చివేశారో తెలుసా? (video)

సైబరాబాద్: డ్రంక్ డ్రైవ్ చేసిన 385 మంది అరెస్ట్.. రైడర్లు కూడా?

తిరుమలకు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత

హైదరాబాద్‌లో తొలి అన్న క్యాంటీన్ ప్రారంభం

అమరావతి నిర్మాణం వేగవంతం- సీఆర్‌డీఏ అధికారులతో చర్చలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments