'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

ఠాగూర్
గురువారం, 13 నవంబరు 2025 (17:47 IST)
'ది కేరళ స్టోరీ' తర్వాత తర్వాత తనను చంపేందుకు ప్లాన్ చేశారని బాలీవుడ్ నటి ఆదా శర్మ అన్నారు. 2023లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రం తర్వాత దేశంలో సగం మంది తనను చంపాలని చూశారని వెల్లడించారు. ఆ సమయంలో మిగితా సగం మంది తనకు మద్దతుగా నిలిచి తన ప్రాణాలను కాపాడారని చెప్పారు. 
 
ఇదే విషయంపై ఆమె మాట్లాడుతూ, "రిస్క్‌తో కూడిన పాత్రలు చేసినపుడే కెరీర్‌కు విలువు వస్తుంది. నేను '1920' సినిమాతో పరిశ్రమలోకి వచ్చాను. నా తొలి చిత్రమే ఒక పెద్ద సాహసం. 'ది కేరళ స్టోరీ' వచ్చే వరకు మంచి స్క్రిప్టు కోసం ఎదురు చూశాను. ఆ చిత్రం తర్వాత నా కెరీర్ పూర్తిగా మారిపోయింది. దాని తర్వాత నేను నటించిన 'బస్తర్ : ది నక్సల్ స్టోరీ' చిత్రాల సమయంలోనూ తీవ్రమైన బెదిరింపులు ఎదుర్కొన్నాను. దేశంలో సగం మంది నన్ను చంపాలని కోరుకుంటే మిగిలిన సగం మంది నాపై ప్రశంసలు కురిపిస్తూ నన్ను రక్షించారు' అని వివరించారు. 
 
పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్ 
 
బాలీవుడ్ నటి కాజోల్ పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. పెళ్ళికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందన్నారు. అలాగే, రెన్యువల్ ఆప్షన్ కూడా ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పలువురు సినీ ప్రముఖులను ఆశ్చర్యానికి గురిచేశాయి. గత రెండున్నదశాబ్దాలకు పైగా వైవాహిక జీవితాన్ని గడుపుతున్న కాజల్ అగర్వాల్ ఇపుడు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. 
 
బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నాతో కలిసి కాజోల్ కలిసి నిర్వహిస్తున్న 'టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్' అనే సెలబ్రిటీ టాక్ షో తాజా ఎపిసోడ్‌కు నటులు విక్కీ కౌశల్, కృతి సనన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్వింకిల్ ఖన్నా 'వివాహానికి గడువు తేదీ, రెన్యువల్ ఆప్షన్ ఉండాలా?' అని ప్రశ్నించారు. దీనికి విక్కీ, కృతి, ట్వింకిల్ 'వద్దు' అని చెబుతూ రెడ్ జోనులో నిలబడగా, కాజోల్ మాత్రం 'అవును' అంటూ గ్రీన్ జోనులోకి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు.
 
వెంటనే ట్వింకిల్ ఖన్నా సరదాగా 'అది పెళ్లి.. వాషింగ్ మెషీన్ కాదు కదా!' అని చమత్కరించారు. దీనికి కాజోల్ బదులిస్తూ, 'నేను నిజంగానే అలా అనుకుంటున్నాను. మనం సరైన సమయంలో సరైన వ్యక్తినే పెళ్లి చేసుకుంటామని ఎవరు హామీ ఇస్తారు? గడువు ఉంటే ఎక్కువ కాలం బాధపడాల్సిన అవసరం ఉండదు. అలాగే, రెన్యువల్ ఆప్షన్ ఉంటే ఆ బంధానికి కొత్త అర్థం వస్తుంది' అని తన అభిప్రాయాన్ని స్పష్టంగా వివరించారు.
 
అదే షోలో 'డబ్బుతో ఆనందాన్ని కొనుగోలు చేయవచ్చా?' అనే మరో ప్రశ్న రాగా... కాజోల్ 'లేదు' అని సమాధానమిచ్చారు. 'డబ్బు ఎక్కువగా ఉండటం వల్ల కొన్నిసార్లు నిజమైన సంతోషాన్ని అర్థం చేసుకునే అవకాశం కూడా కోల్పోతాం' అని ఆమె పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

32 ఏళ్లు వచ్చినా పెళ్లి కావడంలేదని రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతాం : సీఎం చంద్రబాబు

కడుపు నొప్పితో మహిళ స్కానింగుకి వస్తే ప్రైవేట్ భాగాలను తాకుతూ వేధింపులు (video)

Gujarat: భార్యాభర్తల మధ్య కుక్క పెట్టిన లొల్లి.. విడాకుల వరకు వెళ్లింది..

ఢిల్లీ ఎర్రకోట కారుబాంబు పేలుడు : మరో వైద్యుడు అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments