Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ ఇక పనికిరాడు.. రోహిత్‌ను ఎంచుకోండి : శ్రీరెడ్డి

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (11:22 IST)
లీడ్స్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఏకంగా ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీనికి కారణం బ్యాట్స్‌మెన్ చెత్తగా ఆడటమే. ముఖ్యంగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. 
 
ఈ మ్యాచ్‌లో కోహ్లీ నుంచి సిరాజ్ వరకు కేవలం 54 నిమిషాల్లో పెవీలియన్ చేరిపోయారంటే భారత జట్టు ఎంత దారుణంగా బ్యాటింగ్ చేసిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. లీడ్స్ టెస్టు ఓటమితో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమంగా మారింది. మూడున్నర రోజుల్లోనే ముగిసిన ఈ టెస్ట్‌లో కోహ్లీసేన చెత్త బ్యాటింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. అయితే ఈ ఘోరపరాజయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 
 
కెప్టెన్ విరాట్ కోహ్లీ అసమర్థత వల్లనే ఈ ఘోర పరాజయం ఎదురైందని కామెంట్ చేస్తున్నారు. ఇక, ఈ లిస్ట్ లో శ్రీ రెడ్డి కూడా చేరింది. అంతేకాకుండా టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమించాలని, సారథిగా విరాట్ కోహ్లీ పనికిరాడని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
 
మ్యాచ్ ముగిసిన తర్వాత ట్విటర్ వేదికగా స్పందించిన ఆమె.. విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. "కోహ్లీ ఓ చెత్త ఆటగాడని, అతని బ్యాటింగ్ పరమచెత్తగా ఉందని, రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చిందని" కామెంట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వచ్ఛ మహానాడు, జీరో-వేస్ట్ ఈవెంట్‌.. 50వేల మంది ప్రతినిధులు హాజరు

వివాహేతర సంబంధం: 40 ఏళ్ల వివాహిత, 25 ఏళ్ల యువకుడు.. ఆపై ఆత్మహత్య.. ఎందుకు?

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments