Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కంట్లో కన్నీరు ఇంకిపోయింది.. తీసుకెళ్లమని దేవుడిని ప్రార్థించా... సంజనా గల్రానీ

Webdunia
ఆదివారం, 21 ఫిబ్రవరి 2021 (11:14 IST)
కన్నడ చిత్రపరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన హీరోయిన్లలో సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదిలు ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరు కోర్టు బెయిలుపై జైలునుంచి బయటకు వచ్చారు. అయితే, జైలు నుంచి విడుదలైన సంజనా గల్రానీ తాజాగా మీడియాతో మాట్లాడారు. 
 
"నేను కొన్ని నెలలుగా ఏడుస్తూనే ఉన్నాను. నా కంట్లో కన్నీరు కూడా ఇంకిపోయిందేమో. నన్ను ఇంతగా కష్టపెట్టే బదులు తీసుకెళ్లి పొమ్మని భగవంతుడిని ప్రార్థించాను" అని చెప్పుకొచ్చింది. 
 
తాను వెళుతున్న మార్గం చాలా రఫ్‌గా ఉంటుందని తనకు తెలిసిందని, దాన్ని దాటేసి, తిరిగి ఎప్పటిలా పైకి ఎగరాలనుందని ఆమె చెప్పింది. భారత న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుందని తెలిపింది. 
 
తనకు లాక్డౌన్ సమయంలో నిశ్చితార్థం జరిగిందని చెప్పారు. లాక్డౌన్ కారణంగా నిశ్చితార్థాన్ని ప్రకటించలేకపోయానని, ఇప్పుడు వివాహాన్ని కూడా చిన్న వేడుకలా మాత్రమే చేసుకుంటానని చెప్పుకొచ్చింది. ఏదైనా చారిటబుల్ ట్రస్టులో తమ పెళ్లి జరుగుతుందని సంజన వ్యాఖ్యానించింది.

సంబంధిత వార్తలు

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments