Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముమైత్ ఖాన్ కారులో అసభ్యంగా ప్రవర్తించింది.. అలా చేయొద్దన్నందుకు (Video)

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (19:49 IST)
టాలీవుడ్ ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్ బండారాన్ని ఓ కారు డ్రైవర్ బట్టబయలుచేశాడు. గోవా ట్రిప్ సమయంలో ముమైత్ ఖాన్ కారులో అసభ్యంగా ప్రవర్తించిందని ఆరోపించారు. పైగా, అలా చేయొద్దన్నందుకు తనను బూతులు తిట్టిందని వాపోయాడు. ఇదే అంశంపై తాను అసోసియేషన్లో ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. 
 
ఇంతకీ ముమైత్ ఖాన్ ఇబ్బంది పెట్టింది ఓ ట్యాక్సీ డ్రైవర్ రాజు. దీంతో ఆ ట్యాక్సీ డ్రైవర్ ముమైత్ ఖాన్ బండారాన్ని బయటపెట్టాడు. పైగా, తనను ఏ విధంగా వేధించాడో పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చాడు. దీనిపై డ్రైవర్ రాజు మాట్లాడుతూ, ముమైత్‌ ఖాన్‌ రూ.30 వేలకు గోవా ట్రిప్‌ మాట్లాడుకుందని, మూడు రోజుల కోసం గోవా ట్రిప్‌కు కారు తీసుకెళ్లిందన్నారు. 
 
అయితే 5 రోజుల పాటు గోవాలో తిప్పిందని వాపోయాడు. డీజిల్‌ ఖర్చుకు డబ్బులు అడిగితే ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని, కారులో మద్యం, సిగరెట్లు తాగుతూ అసభ్యంగా ప్రవర్తించిందని వాపోయాడు. 'అలా చేయొద్దన్నందుకు నన్ను బూతులు తిట్టి బెదిరించింది. ముమైత్‌ ఖాన్‌ దగ్గర పనిచేసిన డ్రైవర్లు కాల్ చేసి.. తమను కూడా ఇబ్బంది పెట్టిందని వారి బాధలు చెప్పుకుంటున్నారు. 
 
రోజు కూలీ చేసుకునే నాపట్ల ఇలా వ్యవహరిస్తుందనుకోలేదు. ఒక సెలబ్రిటీ ఇలా వ్యవహరిస్తుందని అనుకోలేదు. గోవా నుంచి వచ్చిన వెంటనే 100కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాను. మా డ్రైవర్ల అసోసియేషన్‌తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. నాకు రావాల్సిన రూ.15 వేలు ఇస్తుందో లేదో తెలీదు' అంటూ డ్రైవర్ రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
కాగా, ముమైత్‌ ఖాన్‌‌పై డ్రైవర్‌ రాజు చేస్తున్న ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనను మోసం చేసిందని రాజు మంగళవారం నుంచి మీడియాతో తన బాధలను చెప్పుకున్నాడు. టోల్ గేట్‌కు, డ్రైవర్ అకామిడేషన్‌కు డబ్బులు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
సోషల్ మీడియా వేదికగా టోల్‌గేట్ దగ్గర కట్టిన డబ్బులు తాలూకు రిసిప్ట్స్‌, ముమైత్‌తో కలిసిన దిగిన ఫొటోలు, ఆమెతో చేసిన వాట్సాప్ చాట్‌ను రాజు షేర్ చేశాడు. ముమైత్ తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇంతవరకూ ముమైత్ మాత్రం కనీసం సోషల్ మీడియాలో కూడా స్పందిచకపోవడం గమనార్హం.
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments