Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భర్తకు విడాకులిప్పించి.. పెళ్లి చేసుకున్నాడు.. ఇపుడే వేధిస్తున్నాడు...

భర్తకు విడాకులిప్పించి.. పెళ్లి చేసుకున్నాడు.. ఇపుడే వేధిస్తున్నాడు...
, శుక్రవారం, 3 జులై 2020 (16:05 IST)
కట్టుకున్న భర్తకు విడాకులు ఇప్పించి తనను పెళ్లి చేసుకున్నాడనీ, ఇపుడు వదలించుకునేందుకు వేధిస్తున్నాడంటూ ఓ ఎస్ఐపై మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా ముప్పాళ్ళలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా ముప్పాళ్ళకు చెందిన ఓ మహిళ తన భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. అపుడు ఎస్.ఐ జగదీష్ తనకు న్యాయం చేస్తానని మొబైల్ నంబరు తీసుకున్నాడు. ఆ తర్వాత తనను ఇంటికి పిలిచి బలవంతంగా లొంగ దీసుకుని అత్యాచారం జరిపాడని పేర్కొంది. 
 
అప్పటి నుంచి బెదిరిస్తూ అత్యాచారం చేస్తూ వచ్చాడని పేర్కొంది. ఆ తర్వాత... తన భర్తకు విడాకులిప్పించి, తనను  వివాహం చేసుకున్నాడని తెలిపారు. అయితే ఇపుడు తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. తనకు ఆ ఎస్‌ఐతో  ప్రాణహాని ఉందని ఆందొళన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని ఆ మహిళ వేడుకున్నారు. ఈ మేరకు ఆమె నరసారావు పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రఘురామ కృష్ణరాజును అనర్హుడిగా ప్రకటించండి.. లోక్ సభ స్పీకర్ కు వైసీపీ ఎంపీల వినతి