Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఛాన్సులు.. పెరిగిన యూత్ ఫాలోయింగ్!!

ఠాగూర్
గురువారం, 21 నవంబరు 2024 (14:20 IST)
ఇటీవలి కాలంలో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ చిత్రంలో నటించిన ఈ అందాల బ్యూటీకి తెలుగులో వరుస అవకాశాలు వరిస్తున్నాయి. ఇప్పటివరకు తెలుగు తెరపై మెరిసిన పొడగరి భామలలో ఒకరుగా నిలవడమే ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. 'మిస్టర్ బచ్చన్' సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఆ సినిమాలో గ్లామర్ పరంగా ఆమె చేసిన మాయజాలాన్ని ప్రేక్షకులు మరిచిపోలేదు.
 
ఈ నేపథ్యంలోనే భాగ్యశ్రీకి రామ్ సినిమాలో ఛాన్స్ దక్కింది. రామ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ - ఫీల్ గుడ్ వారు కలిసి ఒక ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకుని వెళుతున్నారు. గురువారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాకి దర్శకత్వం వహించిన మహేశ్ బాబు పి, ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. కెరియర్ పరంగా రామ్‌కి ఇది 22వ సినిమా.
 
కొంతకాలంగా రామ్‌ను వరుస ఫ్లాపులు పలకరిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన 'డబుల్ ఇస్మార్ట్' కూడా ఆయనను కాపాడలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ సినిమాను అంగీకరించాడు. ఈ సినిమా హిట్ రామ్‌తో పాటు భాగ్యశ్రీకి కూడా చాలా అవసరమే. ఈ సినిమాతో హిట్ దొరికితే ఈ సుందరి హవా కొనసాగే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments